Munaf Patel: గంభీర్ను నిందించడం ఆపండి.. తప్పు చేసింది బీసీసీఐ..
- కివీస్, సౌతాఫ్రికా జట్ల చేతిలో సిరీస్లు ఓడిన భారత్..
- గంభీర్ను విమర్శించడం ఆపాలని చెప్పిన మాజీ క్రికెటర్..
- గంభీర్ని బాధ్యుడిని చేయడం సరికాదు, అసలు కారణం బీసీసీఐ: మునాఫ్ పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munaf Patel: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 12 ఏళ్ల పాటు అజేయంగా నిలిచిన టీమిండియా.. గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత ముఖ్యంగా టెస్టు క్రికెట్లో సొంత మైదానాల్లో భారత్ ప్రదర్శన చెత్తగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితులు రావడానికి గంభీర్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని, అసలు కారణం బీసీసీఐ నిర్ణయాలేనని మాజీ భారత క్రికెటర్ మునాఫ్ పటేల్ స్పష్టం చేశారు.
Read Also: Stock Market: ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
Also Read
- IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
- Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
స్పిన్ ఆడలేకపోతున్న బ్యాటర్లు:
‘బ్రేకింగ్ స్పోర్ట్స్ విత్ వివేక్ సేథియా’ కార్యక్రమంలో మాట్లాడిన మునాఫ్ పటేల్.. టీమిండియా సొంత మైదానాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేకపోవడమేనని అన్నారు. మన బ్యాటర్లకు కనీసం స్పిన్ బౌలింగ్ లో ఎలా ఆడాలో తెలియడం లేదు.. అందుకు కారణం డొమెస్టిక్ క్రికెట్లో తిరిగే పిచ్లు లేకపోవడమే అన్నారు. కనీసం 6 మిల్లీమీటర్ల గడ్డి తప్పనిసరి అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.. అలా ఉంటే పిచ్ లో బంతి ఎలా తిరుగుతుంది? అని ప్రశ్నించారు.
గంభీర్ను తప్పుపట్టవద్దు:
గంభీర్ను టార్గెట్ చేయడాన్ని మునాఫ్ పటేల్ తీవ్రంగా తప్పుబట్టారు. అందరూ గౌతమ్ గంభీర్నే తప్పుపడుతున్నారు.. కానీ ఆయన మైదానంలోకి వెళ్లి బ్యాటింగ్ చేయడం లేదు.. బ్యాటింగ్ చేస్తున్న వాళ్లు సరిగ్గా ఆడలేకపోతున్నారని మండిపడ్డారు. గంభీర్పై నిందలు వేయడం అన్యాయం అన్నారు. గతంలో భారత్ హోం గ్రౌంగ్స్ లో ఆడే సమయంలో జట్టు బలాలకు అనుగుణంగా పిచ్లను తయారు చేసేవారని ఈ మాజీ క్రికెటర్ గుర్తు చేశారు. ముందు మన క్యూరేటర్లు మన బలాన్ని దృష్టిలో పెట్టుకుని పిచ్లు సిద్ధం చేసేవారు.. అందుకే సొంత మైదానాల్లో స్పిన్ కి అనుకూలించే పిచ్ లు ఉండేవి.. ఇప్పుడు బ్యాటర్లకు స్పిన్ ఎలా ఆడాలో కూడా తెలియడం లేదని విమర్శించారు.
Read Also: KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
గంభీర్ మంచి కోచ్:
ఒక వ్యక్తినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గంభీర్ మంచి కోచ్.. ఆయన ఇప్పటికే ఒక ఐసీసీ టైటిల్ గెలిచారు అని మునాఫ్ పటేల్ తెలిపారు. ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ను డ్రా చేయించారు అంటూ గంభీర్కు మద్దతు ప్రకటించారు. ఇక, భారత్ 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించలేదు. అంతేకాదు, సొంత మైదానాల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి కారణంగా 2027 WTC ఫైనల్ అవకాశాలు కూడా ప్రమాదంలో పడ్డాయని క్రిడా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, టీ20 ప్రపంచకప్ 2026 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన అట్టహాసంగా స్టార్ట్ కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్తో ముగియనుంది. ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు బరిలో ఉండగా, 55 మ్యాచ్లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా టోర్నీలో అడుగు పెడుతున్న భారత్, మూడోసారి కప్ గెలిచి, టైటిల్ను నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని చూస్తుంది.
తాజావార్తలు
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..