Indian Boarder : భారత సరిహద్దులో ఇద్దరు చైనీయులు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి నేపాల్లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి సుసంద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ సమాచారాన్ని అందించినట్లు వివరించారు.
నిందితుల నుంచి రెండు పాస్పోర్టులు, మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, 133 డాలర్ల అమెరికా కరెన్సీ, రూ.2,000 భారత కరెన్సీ, భారత ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు అరెస్టైన ఇద్దరు చైనా జాతీయులను ఎస్ఎస్బీ అధికారులు, పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరూ మే 23న ఒక మహిళతో కలిసి థాయిలాండ్ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండుకు వచ్చారు. నెల రోజుల నేపాల్ వీసాను పొందారు. మే 24న ట్యాక్సీలో ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూకు వచ్చారు. అక్కడి నుంచి ఢిల్లీ సమీపంలోని నోయిడాకు వెళ్లారు. అక్కడ మరో చైనా జాతీయుడైన జాకీ ఇంట్లో జూన్ 10 వరకు ఉన్నారు. అనంతరం నేపాల్కు తిరుగు ప్రయాణమయ్యారు. ట్యాక్సీలో భితామోర్కు చేరుకున్నారు. సీతామర్హికి చేరుకుని అక్కడి నుంచి రిక్షాలో నేపాల్ సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!