Vijay: రాజీవ్ గాంధీ హంతకుడిపై యాక్టర్ విజయ్ ప్రశంసలు.. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి ఏమన్నారంటే.
- ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్పై నటుడు విజయ్ ప్రశంసలు..
- శ్రీలంక తమిళ సమాజానికి తల్లి లాంటి వారంటూ కితాబు..
- తమిళనాట సంచలనంగా మారిన టీవీకే చీఫ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
Read Also: India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా, నాగపట్నంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ శ్రీలంక తమిళులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభాకరన్ సమాజానికి ‘‘తల్లి లాంటి వారు’’ అని అన్నారు. శ్రీలంక తమిళుల సమస్య తమిళనాడులో, ముఖ్యంగా నాగపట్నం ప్రాంతంలో భావోద్వేగాలతో కూడి ఉంటుంది. ‘‘తమిళ ప్రజలకు శ్రీలంక తమిళులు సోదరులు అని, ఈలం తమిళులు వారు శ్రీలంకలో ఉన్నా లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నా, తమపై మాతృ ప్రేమను చూపించిన నాయకుడిని కోల్పోయిన తర్వాత బాధపడుతున్నారు’’ అని ప్రభాకరన్ గురించి విజయ్ అన్నారు. వారి కోసం మాట్లాడటం మన కర్తవ్యం అని చెప్పారు. విజయ్ శ్రీలంక తమిళుల కోసం మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2008లో శ్రీలంక తమిళుల హత్యకు నిరసనగా చెన్నైలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
రెండు దశాబ్ధాల పాటు శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో ఎల్టీటీఈ సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. 1990లో భారత్ ఎల్టీటీఈని నిషేధించింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2009లో శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి జరిగిన భీకర పోరాటంలో ప్రభాకరన్ మరణించాడు. అప్పటి నుంచి శ్రీలంకలో ఈ వేర్పాటువాద ఉద్యమం అంతమైంది. ఎల్టీటీఈతో పోరాడేందుకు రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని పంపారనే కోపంతో 1991లో ప్రభాకరన్, ఎల్టీటీఈ నిఘా చీఫ్ పొట్టు అమ్మన్ రాజీవ్ గాంధీ హత్యకు పథకం వేశారు. 1991లో చెన్నై సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో శ్రీలంక తమిళ మహిళా ఆత్మాహుతి బాంబర్ శ్రీ గాంధీని పేల్చివేసింది.
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!