India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్యకుమార్ నేతృత్వంలోనే జట్టు ఈ మ్యాచ్లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ఈ మ్యాచ్ కు ముందు.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త వ్యూహాన్ని అనుసరించింది. జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకుంది. అదనంగా, జట్టు తన శిబిరంలోకి మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీల్ ను చేర్చుకుంది. పాకిస్థాన్ జట్టు ఈ ఆకస్మిక చర్య అభిమానులను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ కు ముందు ప్లేయర్లు బయటి వ్యక్తుల నుంచి వచ్చే ఆటంకాలు, మీడియా నుంచి ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు దూరంగా ఉండాలని పాక్ బోర్డు కోరుకుంటోంది. జట్టు మానసికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆటగాళ్లకు మానసిక బలం, ఆత్మవిశ్వాసాన్ని అందించడానికి జట్టులో ఒక ప్రేరణాత్మక స్పీకర్ను చేర్చారు. డాక్టర్ రహీల్ .. పాక్ ఆటగాళ్లకు మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి శిక్షణ ఇస్తారట. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో భయం మొదలైనట్లు కనిపిస్తోంది?
READ MORE: KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్-దశ మ్యాచ్లో షేక్హ్యాండ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్స్తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. దీంతో పాకిస్థాన్ జట్టు ఆగ్రహానికి గురైంది. పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశాన్ని బహిష్కరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత జట్టు, మ్యాచ్ రిఫరీ ఆండీ పైకాట్పై ఫిర్యాదు చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పీసీబీ ఫిర్యాదులను తిరస్కరించడంతో తోకముడిచింది.
తాజావార్తలు
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!