Mamata Banerjee: బెంగాల్ని బంగ్లాదేశ్లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
- బెంగాల్ని బంగ్లాదేశ్లా చేయాలనుకుంటున్నారు..
- వైద్యురాలి అత్యాచార..హత్య ఘటనపై రాజకీయాలు..
- బీజేపీ..సీపీఎంపై విరుచుకుపడిన సీఎం మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ కేసులోని నిందితులతో టీఎంసీ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది.
ఈ ఘటన బీజేపీ, సీపీఎంలు ‘‘చౌకబారు రాజకీయాలకు’’ పాల్పడుతున్నాయని సీఎం మమతా బెనర్జీ బుధవారం ఫైర్ అయ్యారు. ‘‘బాధిత మహిళ కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి రెండు పార్టీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ పరిస్థితులు తీసుకురావాలని వారు భావిస్తున్నారు. అయితే తాను అధికారం కోసం అత్యాశతో లేను’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
Read Also: Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
రాత్రంతా ఈ కేసుని పర్యవేక్షించానని, నేరం గురించి తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్తో పాటు మహిళ తల్లిదండ్రులతో మాట్లాడానని ఆమె చెప్పారు. మేం ఏం చర్యలు తీసుకోలేదు..? అని ఆమె ప్రశ్నించారు. అత్యాచారంలో నిందితుడిని ఉరిశిక్ష విధించేలా చేస్తామని మహిళ తల్లిదండ్రులతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. లేడీ డాక్టర్ అంత్యక్రియాలు జరిగే వరకు పోలీసులతో తాను టచ్లో ఉన్నానని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ఎస్కార్ట్ చేశారని, నిందితుడిని పోలీసులు 12 గంటల్లో అరెస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
‘‘పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజ్, ఇతన పరీక్షలు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. 12 గంటల్లోనే హంతకుడిని అరెస్ట్ చేశాం’’ అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని కేసుని సీబీఐకి అప్పగించింది. ‘‘ఏదైనా విచారణ కోసం మీరు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు గడువు విధించాను. సరైన విచారణ లేకుండా మీరు ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌవిస్తాను. సరైన విచాణ లేకుండా నేను వ్యక్తుల్ని అరెస్టు చేయలేను’’ అని ఆమె అన్నారు. తాము పూర్తిగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి సీబీఐకి సహకరిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!