Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
- శిల్పి అరుణ్ యోగిరాజ్కి వీసా తిరస్కరించిన అమెరికా..
- అయోధ్య రాముడి విగ్రహ శిల్పిగా ఫేమస్..
- ఎలాంటి కారణం లేకుండా తిరస్కరించారని కుటుంబం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజ్ ఫేమస్ అయ్యారు. అమెరికా వర్జీనియాలో జరిగే మూడు రోజుల సదస్సు కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 01 వరకు 12వ AKKA వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ (WKC 2024)కి యోగిరాజ్కి ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అమెరికా వీసా నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శిల్ప కళా రంగంలో యోగి రాజ్ చేసిన సేవలని గుర్తిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని పంపారు.
అమెరికా వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీసా నిరాకరించడంపై ఆయన భార్య మాట్లాడుతూ.. ఆయన చాలా సార్లు అమెరికా వెళ్లారు, ఎప్పుడూ అమెరికా వీసాను తిరస్కరించలేదు, ఇప్పుడు ఇలా చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అమెరికా పర్యటన ఏకైక ఉద్దేశ్యం కార్యక్రమానికి హాజరుకావడమే అని, ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత యోగిరాజ్ భారతదేశానికి తిరిగి రావాలని భావించారు. అయితే, తాము అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ వీసాను ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: CM Revanth Reddy : ఎయిర్పోర్ట్కు దగ్గర్లో ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాం
రామ్ లల్లాను చెక్కిన శిల్పిగా పేరు..
ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహానికే ప్రాణప్రతిష్ట చేశారు. కార్పొరేట్ సెక్టార్లో కొంత కాలం పనిచేసిన ఆయన 2008లో శిల్పకళపై మక్కువతో ఈ కళను ఎంచుకున్నారు. రామ్ లల్లా విగ్రహంతో పాటు ఇండియా గేట్ సమీపంలోని 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదార్నాథ్లో 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, మైసూరులో 21 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయనే తయారు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..