Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
- శిల్పి అరుణ్ యోగిరాజ్కి వీసా తిరస్కరించిన అమెరికా..
- అయోధ్య రాముడి విగ్రహ శిల్పిగా ఫేమస్..
- ఎలాంటి కారణం లేకుండా తిరస్కరించారని కుటుంబం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజ్ ఫేమస్ అయ్యారు. అమెరికా వర్జీనియాలో జరిగే మూడు రోజుల సదస్సు కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 01 వరకు 12వ AKKA వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ (WKC 2024)కి యోగిరాజ్కి ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అమెరికా వీసా నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శిల్ప కళా రంగంలో యోగి రాజ్ చేసిన సేవలని గుర్తిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని పంపారు.
అమెరికా వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీసా నిరాకరించడంపై ఆయన భార్య మాట్లాడుతూ.. ఆయన చాలా సార్లు అమెరికా వెళ్లారు, ఎప్పుడూ అమెరికా వీసాను తిరస్కరించలేదు, ఇప్పుడు ఇలా చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అమెరికా పర్యటన ఏకైక ఉద్దేశ్యం కార్యక్రమానికి హాజరుకావడమే అని, ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత యోగిరాజ్ భారతదేశానికి తిరిగి రావాలని భావించారు. అయితే, తాము అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ వీసాను ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
Read Also: CM Revanth Reddy : ఎయిర్పోర్ట్కు దగ్గర్లో ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాం
రామ్ లల్లాను చెక్కిన శిల్పిగా పేరు..
ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహానికే ప్రాణప్రతిష్ట చేశారు. కార్పొరేట్ సెక్టార్లో కొంత కాలం పనిచేసిన ఆయన 2008లో శిల్పకళపై మక్కువతో ఈ కళను ఎంచుకున్నారు. రామ్ లల్లా విగ్రహంతో పాటు ఇండియా గేట్ సమీపంలోని 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదార్నాథ్లో 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, మైసూరులో 21 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయనే తయారు చేశారు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!