The Sabarmati Report: నిజం బయటపడుతోంది..గోద్రా విషాదంపై తెరకెక్కిన ‘‘ది సబర్మతి రిపోర్ట్’’పై ప్రధాని ప్రశంసలు..
- ‘‘ ది సబర్మతి రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని ప్రశంసలు..
- 2002 గోద్రా విషాదం ఆధారంగా తెరకెక్కిన సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Sabarmati Report: గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. “ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూడగలిగే విధంగా” అని విక్రాంత్ మాస్సే నటించిన చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ అన్నారు.
2002 గోద్రా విషాదం వెనక దాడి ఉన్న నిజాన్ని బహిర్గతం చేయడంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ధీరనజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 2002లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు, దారితీసిన విషాదం గురించి వివరించింది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినమా నవంబర్ 15న విడుదలైంది.
Also Read
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
Read Also: Minister Nadendla Manohar: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!
గోద్రా విషాదం:
ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్ప్రెస్ గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్కి వచ్చింది. బీహార్లోని ముజఫర్ పూర్ నుంచి గుజరాత్లో అహ్మదాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు.
రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్ని చాలా సార్లు లాగినట్లు డ్రైవర్ తెలిపారు. దీనివల్ల స్టేషన్ వెలువలి సిగ్నల్ వద్ద రైలు ఆగిపోయింది. ఆ తర్వాత భారీ దాడి జరిగింది. 2000 మంది వ్యక్తుల గుంపు రైలుపై రాళ్లను రువ్వారు. నాలుగు కోచ్లను తగలబెట్టారు.
S-6 కోచ్ ఎక్కువగా ప్రభావితమైంది మరియు అగ్నిప్రమాదంలో 27 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గోద్రా తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు జరిగాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు చనిపోయారు.
తాజావార్తలు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు