Speaker Election: ఇండియా కూటమి స్పీకర్ ప్రతిపాదనపై తృణమూల్ అసంతృప్తి..
- ఇండియా కూటమిపై మమతా బెనర్జీ పార్టీ అసంతృప్తి..
- స్పీకర్ పోస్టుకి పోటీపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం..
- తమని సంప్రదించలేదన్న టీఎంసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Election: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. అధికార ఎన్డీయే ప్రభుత్వం తన స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను నామినేట్ చేసింది. మరోవైపు ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ పేరును ప్రతిపాదించింది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తేనే ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది.
ఇదిలా ఉంటే, ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆగ్రహంగా ఉంది. మమతా బెనర్జీకి చెందిన పార్టీ ఈ విషయంలో అసంతృప్తికి గురైంది. తమను సంప్రదించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ స్పీకర్ ఎన్నికల ఇండియా కూటమిలో మరోసారి చిచ్చుకు కారణమైంది. ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సురేష్ని ప్రతిపాదించడంపై టీఎంసీని సంప్రదించి మద్దతు కోరినట్లు సమాచారం.
Also Read
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
Read Also: PM Narendra Modi: జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన..!
మొదటిసారిగా ప్రతిపక్షాలు స్పీకర్ ఎన్నికపై పోటీలో నిలుచున్నాయి. సాధారణంగా సభలో ఎక్కువ సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమించే సంప్రదాయం ఉంది. ఈ లెక్కన కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ని నియమిస్తారని అనుకున్నారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భర్తృహరి మహతాబ్ని నియమించారు. ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.
స్పీకర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ సురేష్ని ప్రతిపాదించడాన్ని తాను టీవీల్లో చూశానని తృణమూల్ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ఆ పార్టీకి చెందిన డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ, తనను అడిగారు కానీ చర్చలు జరగలేదని చెప్పారు. సురేష్కి మద్దతు ఇవ్వడంపై టీఎంసీ సమర్థింస్తుందా..? అనే విషయంపై పార్టీలో చర్చించాల్సి ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!