Speaker election: కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు..
- స్పీకర్ ఎన్నికలో కీలక పరిణామం..
- కాంగ్రెస్ అభ్యర్థికి తృణమూల్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker election: లోక్సభ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ ఓం బిర్లా పోటీలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ని స్పీకర్ పోస్టుకు ప్రతిపాదించింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నుకుంటాయి. అయితే, ఈసారి డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు కావాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో తాము కూడా స్పీకర్ పదవికి పోటీ చేస్తామని ఇండియా కూటమి తరుపున అభ్యర్థిని నిలబెట్టారు.
ఇదిలా ఉంటే, తమకు చెప్పకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ రోజు టీఎంసీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్తో దాడి..
బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!