Speaker election: కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు..
- స్పీకర్ ఎన్నికలో కీలక పరిణామం..
- కాంగ్రెస్ అభ్యర్థికి తృణమూల్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker election: లోక్సభ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ ఓం బిర్లా పోటీలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ని స్పీకర్ పోస్టుకు ప్రతిపాదించింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నుకుంటాయి. అయితే, ఈసారి డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు కావాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో తాము కూడా స్పీకర్ పదవికి పోటీ చేస్తామని ఇండియా కూటమి తరుపున అభ్యర్థిని నిలబెట్టారు.
ఇదిలా ఉంటే, తమకు చెప్పకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ రోజు టీఎంసీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్తో దాడి..
బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!