Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు
- గచ్చిబౌలిలో నిత్యపెళ్లి కొడుకు కోసం పోలీసుల గాలింపు
- విగ్లు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ
- దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసిన వంశీ
- ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లివచ్చిన నిత్యపెళ్లికొడుకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial fraud: నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లివచ్చిన నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణ.. మ్యాట్రిమోని డాట్కామ్లో అందమైన ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
Read Also: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ మోసం చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి రూ.40 లక్షల వరకు విగ్గురాజా వంశీకృష్ణ వసూలు చేసినట్లు తెలిసింది.వంశీకృష్ణ మోసాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్ తల్లిదండ్రులు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి..సోషల్మీడియాలో పెడుతానంటూ ఆమె తండ్రిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహిళా డాక్టర్ తండ్రి. దీంతో అతడి ఆగడాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ యజమానిని అని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలా చాలా మందిని మోసం చేసినట్లు తెలిసింది. నిందితుడు ఎంతో మంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడు. విగ్గురాజా ఏం చదివాడో ఎవరికీ తెలియదు గానీ మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించడంలో మాత్ర పీహెచ్డీ చేశాడు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!