Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు
- గచ్చిబౌలిలో నిత్యపెళ్లి కొడుకు కోసం పోలీసుల గాలింపు
- విగ్లు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ
- దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసిన వంశీ
- ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లివచ్చిన నిత్యపెళ్లికొడుకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial fraud: నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లివచ్చిన నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణ.. మ్యాట్రిమోని డాట్కామ్లో అందమైన ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
Read Also: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ మోసం చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి రూ.40 లక్షల వరకు విగ్గురాజా వంశీకృష్ణ వసూలు చేసినట్లు తెలిసింది.వంశీకృష్ణ మోసాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్ తల్లిదండ్రులు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి..సోషల్మీడియాలో పెడుతానంటూ ఆమె తండ్రిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహిళా డాక్టర్ తండ్రి. దీంతో అతడి ఆగడాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ యజమానిని అని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలా చాలా మందిని మోసం చేసినట్లు తెలిసింది. నిందితుడు ఎంతో మంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడు. విగ్గురాజా ఏం చదివాడో ఎవరికీ తెలియదు గానీ మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించడంలో మాత్ర పీహెచ్డీ చేశాడు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!