Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- రాజస్థాన్లో అరుదైన సంఘటన
- 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
నేటి కాలంలో చాలా మంది ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకునే దంపతులు ఉన్నారు. ఇంకొందరు సర్జరీలు కారణంగా ఇద్దరు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితి ఉంది. మరికొందరు ఆర్థిక పరిస్థితులు కారణంగా ఎక్కువ మంది బిడ్డలను కనలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి కాలంలో ఉన్న ఓ మహిళ ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె భాగ్యవంతురాలు కాదు.. కనీసం మధ్యతరగతి కుటుంబం కాదు. చాలా పేద కుటుంబం. అయినా కూడా అంతమంది బిడ్డలను కనింది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం వాస్తవం. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.
ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
కవారా రామ్ కల్బెలియా-రేఖ కల్బెలియా(55) భార్యాభర్తలు. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని లీలావాస్ గ్రామం. తాజాగా 55 ఏళ్ల వయసులో రేఖ 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఉదయపూర్ జిల్లాలోని జాడోల్ బ్లాక్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఈ దంపతులకు 16 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం 12 మంది పిల్లలు ఉన్నారు. తాజాగా మరొకరు జన్మించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరు చిన్నారుల మృతి.. దుండుగుడు ఆత్మహత్య
కవారా రామ్ కల్బెలియా ప్రకారం.. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయినట్లు చెప్పాడు. వీళ్లకు కూడా ఒక్కొక్కరికి ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే రేఖ అమ్మమ్మగా ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కవారా స్క్రాప్ డీలర్గా పనిచేస్తున్నాడు. అప్పులు చేసి పిల్లల వివాహం జరిపించాడు. అంతేకాకుండా పిల్లల్ని ఏ రోజు స్కూల్కు పంపించలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల్ని కనడం మాత్రం ఆపలేదు.
రేఖ తమతో ఇది నాల్గో సంతానం అని అబద్ధం చెప్పిందని డాక్టర్ రోషన్ దరంగి తెలిపారు. ప్రస్తుత ప్రసవాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తెలిసిందన్నారు. చాలా ప్రసవాలు జరగడం.. గర్భాశయం బలహీనపడి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని.. అంతేకాకుండా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని డాక్టర్ హెచ్చరించారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆమె బాగానే ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?