IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఉజ్జయిని టూర్… ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Tour: అధ్యాత్మిక భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళుతూ స్పెషల్ ప్యాకేజీలను ఇస్తు్న్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సారి హైదరాబాద్ టు ఉజ్జయిని టూర్ను ఏర్పాటు చేశారు. ఈ అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో అద్యాత్మిక పర్యటన 3 రాత్రులు, 4 రోజులపాటు కొనసాగనుంది.
Read also: Jithender Reddy: సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీకి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం..!
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అయితే ఈ అధ్యాత్మిక పర్యటనను విమాన మార్గంలో కొనసాగనుంది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 3వ తేది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. 3 రాత్రులు, 4 రోజులు టూర్ కొనసాగుతుంది. మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధర సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, 4 బ్రేక్ఫాస్ట్, 3 డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయని ఐఆర్సీటీసీ ప్రకటించింది.
Read also: Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
మొదటి రోజు హైదరాబాద్ లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం ఉజ్జయిని బయలుదేరాలి. అక్కడ స్థానిక ఆలయాలైన హరసిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు. రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం ( స్వంతంగా) ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్కు బయలుదేరుతారు. రాత్రికి ఓంకారేశ్వర్లో బస ఉంటుంది. రెండో రోజు అల్పాహారం చేసి మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత మహేశ్వర్ బయలుదేరుతారు. మహేశ్వర్ చేరుకున్న అనంతరం అహల్యదేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇండోర్ బయలుదేరాలి. రాత్రికి ఇండోర్లో బస ఉంటుంది. నాలుగో రోజు ఇండోర్లో అన్నపూర్ణ మందిర్, లాల్ భాగ్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. రాత్రి 7.20 గంటలకు ఇండోర్లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!