CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
- విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించాలి
- హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిక
- సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై CJP అసంతృప్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్రానికి తాజాగా మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది.
మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఇతర రాష్ట్రాలలో సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కూడా అది ఆదేశించింది.
Also Read
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
సుప్రీం ఆదేశాల ప్రకారం, ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు కొనసాగించవచ్చని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరిస్తామని, ఏ విద్యార్థిపైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందని సీజేపీ చెబుతోంది. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఎందుకు తెలియజేయలేదని సీజేపీ ప్రశ్నిస్తోంది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ‘‘పోలీసుల చేతిలో విద్యార్థుల వేధింపులు కొనసాగితే, బొద్దింకల జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం మరియు వేధించడం ఆపాలి’’ అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఎఫ్ఐఆర్లు కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించలేదని సీజేపీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!