Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
- కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం
- సబ్సిడీ డబ్బులు వెనక్కి ఇచ్చేసినట్లు ప్రకటన
- రూ.99 లక్షల సబ్సిడీ పొందిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక సమాచారం వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన సొంత వ్యవసాయ క్షేత్రం కోసం ఉద్యానవన పథకం కింద పొందిన రూ.99 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భగీరథ్ చౌదరి సంబంధిత బ్యాంకుకు సబ్సిడీ మొత్తాన్ని తిరిగి చెల్లించారని, ఆ మొత్తాన్ని జాతీయ ఉద్యానవన బోర్డుకు బదిలీ చేయాలని బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వివాదానికి కారణం
నెల రోజుల క్రితం వెలువడిన మీడియా కథనం ప్రకారం.. భగీరథ్ చౌదరి తన మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న జాతీయ ఉద్యానవన బోర్డు పథకం కింద ఆర్థిక సబ్సిడీ పొందినట్లు వెల్లడైంది. దీంతో ప్రయోజనాల సంఘర్షణ అంశంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నివేదికల ప్రకారం.. భగీరథ్ చౌదరి 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాణిజ్యపరంగా దోసకాయ సాగు చేపట్టేందుకు ఈ సబ్సిడీని పొందారు. ఈ ప్రాజెక్టు 2025లో జాతీయ ఉద్యానవన బోర్డు ఆమోదించిన 467 ప్రతిపాదనల్లో ఒకటిగా నిలిచింది. ఈ సబ్సిడీ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం కింద అందించబడుతుంది. 2014-15లో ప్రారంభమైన ఈ పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఉద్యానవన బోర్డు అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దోసకాయ, క్యాప్సికం, టమాటా వంటి కూరగాయలు, అలాగే గులాబీలు, ఆర్కిడ్లు, ఆంథూరియంల వంటి పూల వాణిజ్య సాగుకు ప్రోత్సాహం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా 50 శాతం వరకు, ఒక కుటుంబానికి రూ.1 కోటి వరకు సబ్సిడీ అందించే అవకాశం ఉంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అభిషేక్ బెనర్జీ ప్రశ్న
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభలో ప్రశ్నిస్తూ.. గత ఐదేళ్లలో కేంద్ర మంత్రులు, ఎంపీలు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా NHB సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందారా? అలాంటి దరఖాస్తుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రామ్నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న NHB మార్గదర్శకాలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు లేదా వారి కుటుంబ సభ్యుల దరఖాస్తుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణ లేదా తప్పనిసరి తప్పుకోవడం వంటి ప్రత్యేక నిబంధనలు లేవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!