PM Modi: సీజేఐకి న్యాయవాదుల లేఖపై స్పందించిన పీఎం మోడీ.. కాంగ్రెస్పై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇతరులను బెదిరించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి. ఐదు దశాబ్ధాల క్రితం వారు న్యాయవ్యవస్థ నిబద్ధత కోసం పిలుపునిచ్చారు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరుకుంటారు, కానీ దేశం పట్ల నిబద్ధతకు దూరంగా ఉంటారు.’’ అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదని అన్నారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్పై అమెరికా తాజా వ్యాఖ్యలు.. జోక్యం తగదన్న భారత్..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
హరీష్ సాల్వే, బార్ కౌన్సిల్ చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా సహా 600 మందికి పైగా న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు లేఖ రాసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి కేసుల్లో ‘‘స్వార్థ ప్రయోజనాల సమూహం’’ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, కోర్టుల పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిన్న ఆల్ మణిపూర్ బార్ అసోసియేషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు లేఖ రాస్తూ న్యాయవ్యవస్థపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. రాజకీయ ఎజెండాలతో న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేసేందుకు స్వార్థప్రయోజనాల గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల పోకడలపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని లేఖలో బార్ అసోసియేషన్ పేర్కొంది.
To browbeat and bully others is vintage Congress culture.
5 decades ago itself they had called for a "committed judiciary" – they shamelessly want commitment from others for their selfish interests but desist from any commitment towards the nation.
No wonder 140 crore Indians… https://t.co/dgLjuYONHH
— Narendra Modi (@narendramodi) March 28, 2024
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!