TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
- తృణమూల్ నిధుల స్కాంతో ఈడీ షాక్..
- టీఎంసీ డబ్బుతో విమానం, హెలికాప్టర్ కొనుగోలు..
- వాటినే అద్దెకు తీసుకుని చెల్లింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో నిధుల మళ్లింపు వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)నే షాక్కు గురిచేస్తోంది. సుమారు రూ.440 కోట్ల నిధులు కలిగిన మూడు బ్యాంక్ అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. పార్టీ నిధులతో విలాసవంతమైన జెట్లు, వీఐపీ హెలికాప్టర్ కొనుగోలు చేసి, ఆ తర్వాత అదే విమానాలకు టీఎంసీ నిధుల నుంచి అద్దె చెల్లించారు. మనీలాండరింగ్ కోణంలో ఒక రాజకీయ పార్టీ నిధులపై ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి.
కోల్కతాకు చెందిన విమానయాన నిర్వహణ, లీజింగ్ సంస్థ అయిన కేర్వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై ఈడీ దాడులు చేసిన తర్వాత ఈ మొత్తం గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ సెప్టెంబర్ 2021లో ఏర్పడింది. ఇదే ఏడాది మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఏప్రిల్ 2023 నుండి జూన్ 2026 మధ్యకాలంలో టీఎంసీ బ్యాంకు ఖాతాల నుండి కేర్వెల్ ఏవియేషన్కు సుమారు రూ.160 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ మొత్తంలో రూ.82.96 కోట్లను ఆ సంస్థ మరో కొత్త కంపెనీకి బదిలీ చేసినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
Also Read
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
రూ. 112 కోట్లతో విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు..
టీఎంసీ డబ్బులు వినియోగించి, కేర్వెల్ ఏవియేషన్ సుమారు రూ. 112 కోట్ల వ్యయంతో ఒక ఎంబ్రాయర్ లెగసీ 600 బిజినెస్ జెట్, అగస్టా 109 ఎస్పీ హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 2023లో హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు కేమన్ ఐలాండ్కు చెందిన ఒక కంపెనీ నుంచి దాదాపుగా రూ. 16 కోట్ల రుణాన్ని తీసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కేమన్ దీవులు ఆఫ్షోర్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ విదేశీ నిధుల మూలాలు, ఉద్దేశ్యంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
సొంత డబ్బులతో కొని, మళ్లీ అద్దె చెల్లింపు:
ఈడీ విచారణలో ఒక విషయం షాకింగ్కు గురిచేస్తోంది. టీఎంసీ నిధులతో కొనుగోలు చేసిన విమానం, హెలికాప్టర్ను కేర్వెల్ ఏవియేషన్ మళ్లీ టీఎంసీకి చార్టర్ సర్వీస్గా అందించింది. అంటే, టీఎంసీ డబ్బులతో కొని, దాన్ని వాడిన ప్రతీసారి టీఎంసీ డబ్బులతో అద్దె చెల్లించారని ఈడీ అనుమానిస్తోంది. అయితే, ఈ విషయంపై దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. కేర్వెల్ ఏవియేషన్ పశ్చిమ బెంగాల్లోని పలువురు వీవీఐపీ నాయకులకు చార్టర్ విమానాలను అందించింది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ కూడా ఈ కంపెనీ చార్టర్ సేవలను ఉపయోగించుకున్నారని బెంగాల్ మీడియా చెబుతోంది.
తాజావార్తలు
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!