RSS: అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు..బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత ఫైర్..
- బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- అహంకారులను 241 వద్ద రాముడు ఆపాడు..
- బీజేపీ సీట్లను ఉద్దేశించి ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేనలపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకరించకపోవడంతోనే సీట్లు తగ్గాయనే వాదన నడుస్తోంది.
Read Also: Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్స్పెక్టర్.. వీడియో వైరల్
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ఇదిలా ఉంటే, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీజేపీ పేలవమైన పనితీరుకు ‘‘అహంకారమే’’ కారణమని అన్నారు. జైపూర్ సమీపంలోని కనోటాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామభక్తితో మెలగేవారు క్రమంగా అహంకారులుగా మారారు. అయితే, అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, అహంకారం కారణంగా రాముడు 241 వద్దే ఆపాడు’’ అని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 241 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మెజారిటీ మార్కును దాటలేకపోయిందని ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. 2014, 2019లో స్వయంగా మెజారిటీ సాధించిన బీజేపీ ఈ సారి మాత్రం మెజారిటీ మార్కుకు దూరంగా ఆగిపోయారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిని ‘‘రాముడికి వ్యతిరేకం’’గా అభివర్ణించారు. రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 వద్ద నిలిపివేశారు. దేవుడి న్యాయం నిజం, ఆనందదాయకం అని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని 20కి పైగా పార్టీలన్నీ కలిసి 234 సీట్లు సాధించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజాసేవలో వినయం యొక్క ప్రాముఖ్యతను బోధించిన కొద్ది రోజుల తర్వాత ఇంద్రేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!