Renuka Ardhya: ఫ్యామిలీ కోసం భిక్షాటన.. ఇప్పుడు బిలియనీర్.. 1000 కార్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమనేది ఉండదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అది నిజమని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా రుజువు చేశారు. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి బిజినెస్ మ్యాన్ మొదట చెప్పే మాట కూడా ఇదే. తాజాగా మరోసారి దీన్ని రుజువు చేశాడు కర్ణాటకకు చెందిన రేణుకా ఆరాధ్య. ‘పెదవాడిగా పుట్టడం నీ కర్మఫలం కావచ్చు.. కానీ అదే పేదవాడిగా చనిపోతే మాత్రం నీ తప్పే అవుతుంది’ అని ఓ కవి చెప్పిన మాటను రేణుకా ఆరాధ్య బాగా ఫాలో అయ్యాడు. ఆ సక్సెస్ మంత్రతో పట్టుదలతో బిక్షగాడి నుంచి బిలియనీర్గా ఎదిగాడు. మరి ఇందుకోసం రేణుకా ఆరాధ్య పాటించిన సక్సెస్ మంత్ర ఏంటో ఈ స్టోరీలో చదవండి!
కుటుంబం కోసం భిక్షాటన
రేణుకా ఆరాధ్యది ఓ పేద కుటుంబం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో వారు నివసించేవారు. కనీసం మూడు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి పేదరికంలోనూ రేణుకా ఆరాధ్య పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో చదువు మానేసి కుటుంబం కోసం భిక్షాటన చేశాడు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పు, పిండి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఇళ్లల్లో పని చేసేవాడు. అలా వచ్చే డబ్బు సరిపోకవడంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించాడు. దానితో పాటు ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరిలో కూడా ఉద్యోగిగా చేరాడు.
Also Read
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
పట్టుదల కోసం పెళ్లి..
అదే సమయంలో రేణుకా ఆరాధ్యకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.పెళ్లయితే కుటుంబ బాధ్యత పెరిగి తనలో ఇంకా పట్టుదల పెరుగుతుందని నమ్మి.. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. సూట్కేసు కవర్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. దానిలో నష్టం రావడంతో అప్పుల పాలు అయ్యాడు. అది తీర్చడం కోసం ఓ ట్రావెల్ ఎజెన్సీలో డ్రైవర్గా చేరాడు. అలా నాలుగు సంవత్సరాలు డ్రైవర్గా పని చేసిన రేణుకా ఆరాధ్యకు సొంతగా ట్రావెల్ ఏజెన్సీ నడపాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక్క కారుతో వ్యాపారం మొదలు పెట్టాడు. మరుసటి ఏడాదికి మరో కారు కొన్నాడు.
ఇంతలో ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దింతో 6 లక్షలకు రేణుకా ఆరాధ్య ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో కంపెనీకి 35 క్యాబ్లు ఉండేవి. అలా మొదలైన తన ట్రావెట్ బిజినెస్ మెల్లిమెల్లిగా లాభాలు చూపించింది. దీంతో అమెజాన్ ఇండియా ప్రమోషన్ కోసం అతడి కంపెనీని ఎంచుకుంది. వాల్మార్ట్ అండ్ జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. క్రమంగా కంపెనీ టర్నోవర్ పెరగి.. అతడి సంపాదన రూ.40 కోట్లు వరకు చేరుకుంది. అలా నేడు రేణుకా ఆరాధ్య బిలియనీర్గా ఎదిగాడు. ప్రస్తుతం అతడి దగ్గర 1000 కార్లు ఉండగా అందులో 250 కార్లు అతడి సొంతం కొన్నవే. ఇక వేల సంఖ్యలో ఉద్యోగులు అతడి దగ్గర పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!