Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్లో జగన్ మోహన్ రెడ్డి
Wealth of CMs: భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.
ఎన్నికల ముందు సమర్పించే అఫిడవిట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఏడీఆర్ ఈ నివేదికను ప్రకటించింది. ఈ నివేదికలో టాప్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టాప్ లో ఉన్నారు. అయితే కోటీశ్వరులు కానీ సీఎంగా ఒకే ఒక్కరుగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. కేవలం ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఏకంగా రూ.510 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల సెల్ఫ్ అఫిడవిట్ విశ్లేషించిన తర్వతే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ తెలిపింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Javed Miandad: “జీవితం, మరణం అల్లా చేతిలో ఉంటాయి”.. పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరించడంపై మియాందాద్
28 రాష్ట్రాల సీఎంలతో పాటు ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ప్రతీ ముఖ్యమంత్రి సగటున రూ.33.96 కోట్ల ఆస్తుల్ని కలిగి ఉన్నట్టు తెలిపింది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది(43 శాతం) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఐదేళ్ల జైలుశిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలు అని నివేదిక పేర్కొంది.
ఏడీఆర్ ప్రకారం ఆస్తుల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( రూ. 510 కోట్లకు పైగా), అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ(రూ. 163 కోట్లకు పైగా), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (రూ. 63 కోట్లకు పైగా) ఆస్తుల్ని కలిగి ఉన్నారు. అత్యల్పంగా ఆస్తులు కలిగిన ముగ్గురు సీఎంలలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ( రూ.15 లక్షలు), కేరళ సీఎం పినరయి విజయన్ ( రూ. 1 కోటికి పైగా), హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ( రూ. 1 కోటి కన్నా ఎక్కువ) జాబితాలో ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ. 3 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!