Kedarnath: కేదార్నాథ్లో ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- కేదార్నాథ్లో ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- టెయిల్ రోటర్ పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేదార్నాథ్లో ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో అమాంతంగా కింద పడింది. పైకి లేచేందుకు ప్రయత్నించినా తిరిగి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్నవారు మొబైల్లో రికార్డ్ చేశారు. అయితే ఛాపర్లో ఉన్నవారంతా సేఫ్గా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Ponnam: త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఎయిర్ అంబులెన్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పని చేయడం లేదు. దీంతో పైలట్ దానిని చాలా కష్టంగా ల్యాండ్ చేశాడు. పైలట్ చాకచక్యంతో ముగ్గురు ప్రాణాలు దక్కాయి. హెలిప్యాడ్ దగ్గర నిలబడి ఉన్న ప్రజలు సహాయం కోసం హెలికాప్టర్ వైపు పరుగెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: ఇంత మంది ఫాలోవర్లు ఉన్న ఇదేం బుద్ధి.. పాక్ కోసం జ్యోతి మల్హోత్రా గూఢచర్యం..
సంజీవని హెలికాప్టర్ అంబులెన్స్ను రిషికేశ్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నడుపుతోంది. హెలికాప్టర్లో ఇద్దరు వైద్యులు, ఒక పైలట్ ఉన్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న యాత్రికుడిని రక్షించడానికి ఎయిర్ అంబులెన్స్ కేదార్నాథ్కు వచ్చింది. అయితే టెయిల్ రోటర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయిందని హెలికాప్టర్ సర్వీస్కు నోడల్ అధికారి చౌబే తెలిపారు. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు నిర్వహిస్తుందని చౌబే తెలిపారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు వైద్యులు, ఒక పైలట్ సురక్షితంగా ఉన్నారని జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి రాహుల్ చౌబే తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!