Mamata Banerjee: ‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..
- ఎన్నికల సంఘానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
- బీజేపీ ఓటర్ జాబితాని మారుస్తోందని ఆరోపణలు..
- ఆట మళ్లీ మొదలైంది అంటూ నినదించిన బెంగాల్ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్న మమతా బెనర్జీ.. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి వెనకడానని సవాల్ చేశారు. ‘‘ నేను 26 రోజులు ధర్నా చేయగలిగితే, ఎన్నికల కమిషన్ ముందు చేయవచ్చు. దీని వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కే ఏ ప్రయత్నానైనా తన పార్టీ ఎదురు నిలుస్తుందని చెప్పారు. మనం మహారాష్ట్రలా కాదు, అని పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు.
Also Read
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
Read Also: KTR : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శల వర్షం
ఆమె ఎన్నికల్లో పార్టీలకు మద్దతుగా ఏజెన్సీలు పనిచేయడం గురించి, ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ గురించి మాట్లాడారు. తన పార్టీకి పీకేతో సంబంధం లేదని, ఐప్యాక్తో ఇప్పుడు ఆయనకు సంబంధ లేదని చెప్పారు. ఆయన వేరే రాజకీయ పార్టీ పెట్టుకున్నారని దీదీ చెప్పింది. పార్టీ ఎన్నికల వ్యూహాల్లో కన్సల్టెన్సీ పాత్రని కూడా ఆమె సమర్థించారు. బీజేపీకి 50 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, టీఎంసీకి ఒక్కటి ఉండటం సమస్య కాకూడదని ఆమె అన్నారు.
మరోవైపు, బయటి వ్యక్తుల్ని ఓటర్ల జాబితాలో బీజేపీ చేర్పిస్తోందని ఆమె ఆరోపించారు. డేటాను తారుమారు చేయడానికి అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే గ్రూపుని మోరిస్తుందని పేర్కొన్నారు. హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తుల పేర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చారని, ఇది ఆన్లైన్ ద్వారా జరుగుతోందని ఆమె ఆరోపిస్తూ , కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ బెంగాల సాంస్కృతిక గుర్తింపుని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారు మహారాష్ట్ర, ఢిల్లీలో ప్లే చేసిన ట్రిక్ బెంగాల్లో కుదరదని చెప్పారు.
తాజావార్తలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..