Mamata Banerjee: ‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..
- ఎన్నికల సంఘానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
- బీజేపీ ఓటర్ జాబితాని మారుస్తోందని ఆరోపణలు..
- ఆట మళ్లీ మొదలైంది అంటూ నినదించిన బెంగాల్ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్న మమతా బెనర్జీ.. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి వెనకడానని సవాల్ చేశారు. ‘‘ నేను 26 రోజులు ధర్నా చేయగలిగితే, ఎన్నికల కమిషన్ ముందు చేయవచ్చు. దీని వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కే ఏ ప్రయత్నానైనా తన పార్టీ ఎదురు నిలుస్తుందని చెప్పారు. మనం మహారాష్ట్రలా కాదు, అని పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Read Also: KTR : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శల వర్షం
ఆమె ఎన్నికల్లో పార్టీలకు మద్దతుగా ఏజెన్సీలు పనిచేయడం గురించి, ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ గురించి మాట్లాడారు. తన పార్టీకి పీకేతో సంబంధం లేదని, ఐప్యాక్తో ఇప్పుడు ఆయనకు సంబంధ లేదని చెప్పారు. ఆయన వేరే రాజకీయ పార్టీ పెట్టుకున్నారని దీదీ చెప్పింది. పార్టీ ఎన్నికల వ్యూహాల్లో కన్సల్టెన్సీ పాత్రని కూడా ఆమె సమర్థించారు. బీజేపీకి 50 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, టీఎంసీకి ఒక్కటి ఉండటం సమస్య కాకూడదని ఆమె అన్నారు.
మరోవైపు, బయటి వ్యక్తుల్ని ఓటర్ల జాబితాలో బీజేపీ చేర్పిస్తోందని ఆమె ఆరోపించారు. డేటాను తారుమారు చేయడానికి అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే గ్రూపుని మోరిస్తుందని పేర్కొన్నారు. హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తుల పేర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చారని, ఇది ఆన్లైన్ ద్వారా జరుగుతోందని ఆమె ఆరోపిస్తూ , కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ బెంగాల సాంస్కృతిక గుర్తింపుని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారు మహారాష్ట్ర, ఢిల్లీలో ప్లే చేసిన ట్రిక్ బెంగాల్లో కుదరదని చెప్పారు.
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!