Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22 మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపారు. అందులో భాగంగా కేసీఆర్కు కూడా ఆమె లేఖ పంపారు.. అంతేకాదు.. ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు కూడా.. అయితే, ఈ సమావేశానిక దూరంగా ఉండాలని గులాబీ పార్టీ బాస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనా అనే చర్చ కూడా సాగుతోంది.. ఇటీవల కొన్ని రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ ప్రకటన చేశారు.. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా దీదీ పావులు కదుపుతున్నారు.. అందులో భాగంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.. రేపు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీతో పాటు 20 పైగా రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు.. కానీ, ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.. కాంగ్రెస్ పార్టీలో కలసి వేదిక పంచుకోవడానికి అనాసక్తితో ఉన్న గులాబీ పార్టీ బాస్.. ఆ సమావేశానికి వెళ్లకూడదనే భావనలో ఉన్నారని సమాచారం.. అయితే, టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతినిధులను మాత్రం ఈ సమావేశానికి పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!