MK Stalin: దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ అణిచివేస్తోంది
- డీలిమిటేషన్పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
- దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ అణిచివేస్తోందని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా దేశం ఏర్పడిందని తెలిపారు. భారత సమాఖ్యను కాపాడటానికి ఇది ముఖ్యమైన రోజు అని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీలిమిటేషన్ సొంత దేశంలో వారిని శక్తిహీనులుగా చేస్తుందన్నారు. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇది సంఖ్యల గురించి కాదు.. ఇది అధికారం గురించి అని పేర్కొన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని.. అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం ఐక్యంగా ఉన్నామని.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్నిర్మాణం ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఇది కూడా చదవండి: Aaron Finch: విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు..
ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, టీఆర్ఎస్ తరపున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. ఇక కేరళ నుంచి ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హాజరయ్యారు. ఏపీ నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గైర్హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Drugs: ఏపీలో ఉగ్రవాదులు ఉపయోగించే డ్రగ్స్.. అధికారులు షాక్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!