Swati Maliwal : స్వాతి మలివాల్కి రేప్, హత్య బెదిరింపులు.. యూట్యూబర్ ధృవ్ రాథీపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal : ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరగడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడు, పీఏ అయిన బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధృవ్ ఠాథీపై విమర్శలు గుప్పించారు.
యూట్యూబర్ ధృవ్ రాథీ తన క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా వీడియోలు పోస్టు చేశారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘ నా పార్టీకి చెందిన నాయకులు, వాలంటీర్లు అంటే ఆప్ నాపై హత్యాయత్నం, బాధితులను అవమానించడం, నాపై భావోద్వేగాలు రెచ్చగొట్టడం వంటి ప్రచారాన్ని నిర్వహించిన తర్వాత, నాకు రేప్, హత్య బెదిరింపులు వస్తున్నాయి. యూట్యూబర్ ధృవ్ రాథీ ఏకపక్ష వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ’’ అని ఆమె ట్వీట్ చేశారు.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
Read Also: Karimnagar: ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు.. మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు
పార్టీకి వ్యతిరేకంగా ఆమె చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఆప్ నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మలివాల్ పేర్కొన్నారు. అయితే, తనపై దాడి ఘటనను ధృవ్ రాథీలో పంచుకోవడానికి తాను చాలా సార్లు ప్రయత్నించానని, ఆయన నుంచి సమాధానం రాలేదని ఆమె చెప్పారు. ఆమె యూట్యూబర్ ధృవ్ రాథీని ఆప్ ప్రతినిధిగా ట్యాగ్ చేశారు. అతను బాధితురాలైన తనను అవమానించాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. రాథీ తన 2.5 నిమిషాల వీడియోలో కొన్ని వాస్తవాలను పేర్కొనడంలో విఫలమైనట్లు చెప్పారు.
వారు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నన్ను భయపెడుతున్నారని ఆప్పై ఆరోపణలు గుప్పించారు. తాను ధృవ్ రాథీని సంప్రదించడానికి నా వంతు ప్రయత్నం చేశానని, కానీ అతను తన కాల్స్ని పట్టించుకోలేదని సమాధానం ఇవ్వలేదని పోస్టులో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునే అతని లాంటి వ్యక్తులు ఇతర ఆప్ అధికార ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గు చేటని, బాధితురాలినైన తనను బెదిరింపులకు, తీవ్ర దుర్భాషలకు గురిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అత్యాచారం మరియు హత్య బెదిరింపులను తాను ఢిల్లీ పోలీసులకు నివేదిస్తున్నానని, అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
After the leaders and volunteers of my party i.e. AAP orchestrated a campaign of charachter assassination, victim shaming and fanning of emotions against me, I have been getting rape and death threats.
This got further exacerbated when YouTuber @Dhruv_Rathee posted a one-sided… pic.twitter.com/EfCHHWW0xu
— Swati Maliwal (@SwatiJaiHind) May 26, 2024
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!