Suvendu Adhikari: బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తాం..
- బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
- బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, సభను వాయిదా వేయాలనే ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తూ, పత్రాలను చింపేశారు. బీజేపీ సభ్యులకు ఎలాంటి పత్రాలు అందించొద్దని స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ కార్యదర్శిని ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలన బీజేపీ ఎమ్మెల్యేల ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు.
అయితే, ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో అత్యంత అరుదైన సంఘటనగా అభివర్ణించారు.”శాసనసభ లోపల కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రతిపక్షం వినిపించుకోవడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ప్రతిదీ చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి నిరసనగా బిజెపి ఎమ్మెల్యేలు వాకౌట్ కూడా చేశారు” అని చెప్పారు.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
Read Also: Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..
“గత నాలుగైదు రోజుల్లో, తమ్లుక్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేసి, నిప్పంటించిన సంఘటనలు జరిగాయి. ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ముర్షిదాబాద్ జిల్లా నవాడా, ఉలుబేరియాలో హిందువులపై దాడి చేశారు. హిందూ దుకాణాల యజమానులు, ఇళ్లకు నిప్పంటించి దోచుకున్నారు” అని సువేందు అధికారి ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న వారిపై ఉలుబేరియాలో దాడి జరిగినట్లు సువేందు పేర్కొన్నారు.
మరోవైపు మార్చి 14న శుక్రవారం కావడంతో, హోలీ వేడుకలు ఉదయం 11 గంటల్లోపే ముగించాలని పోలీసులు కోరారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘‘ముస్లింలీగ్-2’’గా, పోలీసుల్ని మతతత్వవాదులుగా ఆయన ఆరోపించారు. బీర్భూమ్ జిల్లా అదనపు ఎస్పీ శాంతినికేతన్లో బసంత ఉత్సవాలను ఉదయం 11 గంటలకు ముగించాలని కోరుతున్నారని ఆరోపించారు.
హిందువులు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని అధికారం నుంచి దించేస్తానరి సువేందు అధికారి అన్నారు. “మేము స్పీకర్ బిమన్ బెనర్జీని మరియు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడిస్తాము. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి (టిఎంసి) పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలను 10 నెలల్లో వారిని సభ నుండి వెళ్ళగొడతారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..