Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..
- హోలీ వేడుకలకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సిద్ధం..
- సంభాల్ జామా మసీదుతో పాటు 10 మసీదులకు ముసుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi: హోలీ పండగ దగ్గర పడటంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు ఉండటంతో ముఖ్యం మతపరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. గత నవంబర్లో యూపీలో సంభాల్ అల్లర్లకు కారణమైన జామా మసీదులో పాటు మరో 10 మసీదులను ముసుగులతో కప్పనున్నారు.
మార్చి 14న హోలీ ఊరేగింపు మార్గంలోని జామా మసీదు ఇతర మసీదులను ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్తో కప్పాలని పోలీసులు నిర్ణయించారు. రెండు వర్గాల పరస్పర ఒప్పందం తర్వాత హోలీ ఊరేగింపు మార్గంలో ఉన్న అన్ని మతపరమైన ప్రదేశాలను కవర్ చేస్తున్నట్లు ఏఎస్పీ శ్రీశ్చంద్ర తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..‘‘హోలీ ఏడాదికి ఒకేసారి వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు ప్రతీ శుక్రవారం జరుగుతాయి. ఎవరికైనా హోలీ రంగులతో ఇబ్బంది ఉంటే ఇళ్లలోనే ఉండాలి’’ అని సూచించారు. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నుంచి విమర్శించాయి. సీఎం యోగి మాత్రం పోలీస్ అధికారికి మద్దతుగా నిలిచారు.
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
Read Also: Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు
గతేడాది నవంబర్లో జామా మసీదు వివాదంగా నిలిచింది. ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చేసి, ఈ మసీదును నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, మసీదు సర్వేకి కోర్టు ఆదేశించింది. ఈమేరకు సర్వే సమయంలో ముస్లిం మూక ప్రభుత్వ అధికారులపై దాడులు చేసింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించగా, 20కి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంభాల్లో హోలీ సమయంలో సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నేత రఘురాజ్ సింగ్ ముస్లిం పురుషులు హోలీ వేడుకల్లో అసౌకర్యాన్ని నివారించడానికి టార్పాలిన్లతో తయారుచేసిన హిజాబ్ ధరించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేుశారు. బీహార్ దర్భంగా మేయర్ కూడా హోలీ వేడుకల సమయంలో జుమ్మా (శుక్రవారం ప్రార్థనలు) కోసం రెండు గంటల విరామాన్ని సూచించడం కూడా వివాదాన్ని రేకెత్తించింది.
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..