Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..
- హోలీ వేడుకలకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సిద్ధం..
- సంభాల్ జామా మసీదుతో పాటు 10 మసీదులకు ముసుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi: హోలీ పండగ దగ్గర పడటంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు ఉండటంతో ముఖ్యం మతపరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. గత నవంబర్లో యూపీలో సంభాల్ అల్లర్లకు కారణమైన జామా మసీదులో పాటు మరో 10 మసీదులను ముసుగులతో కప్పనున్నారు.
మార్చి 14న హోలీ ఊరేగింపు మార్గంలోని జామా మసీదు ఇతర మసీదులను ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్తో కప్పాలని పోలీసులు నిర్ణయించారు. రెండు వర్గాల పరస్పర ఒప్పందం తర్వాత హోలీ ఊరేగింపు మార్గంలో ఉన్న అన్ని మతపరమైన ప్రదేశాలను కవర్ చేస్తున్నట్లు ఏఎస్పీ శ్రీశ్చంద్ర తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..‘‘హోలీ ఏడాదికి ఒకేసారి వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు ప్రతీ శుక్రవారం జరుగుతాయి. ఎవరికైనా హోలీ రంగులతో ఇబ్బంది ఉంటే ఇళ్లలోనే ఉండాలి’’ అని సూచించారు. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నుంచి విమర్శించాయి. సీఎం యోగి మాత్రం పోలీస్ అధికారికి మద్దతుగా నిలిచారు.
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
Read Also: Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు
గతేడాది నవంబర్లో జామా మసీదు వివాదంగా నిలిచింది. ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చేసి, ఈ మసీదును నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, మసీదు సర్వేకి కోర్టు ఆదేశించింది. ఈమేరకు సర్వే సమయంలో ముస్లిం మూక ప్రభుత్వ అధికారులపై దాడులు చేసింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించగా, 20కి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంభాల్లో హోలీ సమయంలో సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నేత రఘురాజ్ సింగ్ ముస్లిం పురుషులు హోలీ వేడుకల్లో అసౌకర్యాన్ని నివారించడానికి టార్పాలిన్లతో తయారుచేసిన హిజాబ్ ధరించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేుశారు. బీహార్ దర్భంగా మేయర్ కూడా హోలీ వేడుకల సమయంలో జుమ్మా (శుక్రవారం ప్రార్థనలు) కోసం రెండు గంటల విరామాన్ని సూచించడం కూడా వివాదాన్ని రేకెత్తించింది.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!