Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..
- హోలీ వేడుకలకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సిద్ధం..
- సంభాల్ జామా మసీదుతో పాటు 10 మసీదులకు ముసుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi: హోలీ పండగ దగ్గర పడటంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు ఉండటంతో ముఖ్యం మతపరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. గత నవంబర్లో యూపీలో సంభాల్ అల్లర్లకు కారణమైన జామా మసీదులో పాటు మరో 10 మసీదులను ముసుగులతో కప్పనున్నారు.
మార్చి 14న హోలీ ఊరేగింపు మార్గంలోని జామా మసీదు ఇతర మసీదులను ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్తో కప్పాలని పోలీసులు నిర్ణయించారు. రెండు వర్గాల పరస్పర ఒప్పందం తర్వాత హోలీ ఊరేగింపు మార్గంలో ఉన్న అన్ని మతపరమైన ప్రదేశాలను కవర్ చేస్తున్నట్లు ఏఎస్పీ శ్రీశ్చంద్ర తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..‘‘హోలీ ఏడాదికి ఒకేసారి వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు ప్రతీ శుక్రవారం జరుగుతాయి. ఎవరికైనా హోలీ రంగులతో ఇబ్బంది ఉంటే ఇళ్లలోనే ఉండాలి’’ అని సూచించారు. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నుంచి విమర్శించాయి. సీఎం యోగి మాత్రం పోలీస్ అధికారికి మద్దతుగా నిలిచారు.
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
Read Also: Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు
గతేడాది నవంబర్లో జామా మసీదు వివాదంగా నిలిచింది. ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చేసి, ఈ మసీదును నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, మసీదు సర్వేకి కోర్టు ఆదేశించింది. ఈమేరకు సర్వే సమయంలో ముస్లిం మూక ప్రభుత్వ అధికారులపై దాడులు చేసింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించగా, 20కి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంభాల్లో హోలీ సమయంలో సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నేత రఘురాజ్ సింగ్ ముస్లిం పురుషులు హోలీ వేడుకల్లో అసౌకర్యాన్ని నివారించడానికి టార్పాలిన్లతో తయారుచేసిన హిజాబ్ ధరించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేుశారు. బీహార్ దర్భంగా మేయర్ కూడా హోలీ వేడుకల సమయంలో జుమ్మా (శుక్రవారం ప్రార్థనలు) కోసం రెండు గంటల విరామాన్ని సూచించడం కూడా వివాదాన్ని రేకెత్తించింది.
తాజావార్తలు
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..