Supreme Court: సుప్రీం ధర్మాసనం సంచలన నిర్ణయం.. జడ్జీలు ఆస్తులు ప్రకటించాల్సిందేనని వెల్లడి
- సుప్రీం ధర్మాసనం సంచలన నిర్ణయం
- జడ్జీలు ఆస్తులు ప్రకటించాల్సిందేనని వెల్లడి
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందిపర్చాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటన చేయడానికి ఇష్టం లేకపోతే.. కచ్చితంగా వైబ్సైట్లోనైనా వెల్లడించాలని తెలిపింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బుల కట్టలు దొరకడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
న్యాయపరమైన పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు ఉన్నారు. వీరంతా ఆస్తుల వివరాలు వెల్లడించాలని తెలిపింది. ఈ నిర్ణయం భవిష్యత్లో వచ్చే న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1997 తీర్మానం ప్రకారం.. ఆస్తులను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉండేది. అయితే 2009 నిర్ణయం ప్రకారం కోర్టు వెబ్సైట్లో స్వచ్ఛందంగా వెల్లడించడానికి అనుమతి ఉన్నప్పటికీ న్యాయమూర్తుల మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు. కానీ తాజా నిర్ణయంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సమిష్టిగా ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జవాబుదారీతనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆస్తుల వివరాలు సీజేఐకే ఇవ్వకపోయినా.. పబ్లిక్గా కూడా ప్రకటించుకునే అధికారం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు ఆస్తులు వివరాలు ప్రకటించారు. ఇందులో న్యాయమూర్తుల్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఉన్నారు.
ఇది కూడా చదవండి: NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!