Freebies Case: ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme court on Freebies Case: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు.. రాజకీయ పార్టీల ఉచితాలపై కీలక తీర్పు వెల్లడించారు. ఎన్వీ రమణ పదవీ విరమణ చివరి రోజు సందర్భంగా సుప్రీంకోర్టు వాదనల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిన రాజకీయ పార్టీ ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. గత విచారణలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
అనేక రాజకీయ పార్టీలు విచారణ సందర్భంగా ఇవి ఉచితాలు కావని. ప్రజా సంక్షేమ చర్యలని వాదించాయి. ఇదే కేసులో 2013లో ఇచ్చిన తీర్పును మరోసారి పున: సమీక్షించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉచితాల కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఉచితాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్పా.. ఈ కేసులో ఏమీ జరగదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
Read Also: Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
చర్చ జరగాలి.. సమస్య తీవ్రమైనది.. దానిలో ఎటువంటి సందేహం లేదని.. అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు కలవకూడదని ప్రశ్నించింది. భారత ప్రభుత్వం సమావేశానికి పిలువచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ఓటర్లకు ఉంటుందని..ఓటర్లు, పార్టీలు, అభ్యర్థులకు ప్రజలే న్యాయనిర్ణేతలుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఉచితాలపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో పలు పార్టీలు ఉచితాలు కావు.. ఇవి ప్రజా సంక్షేమ పథకాలని చెబుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు ప్రజా సంక్షేమ పథకాల ప్రాధాన్యతను గురించి చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!