Siddique Kappan: సిద్ధిఖీ కప్పన్కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court grants bail to Kerala journalist Siddique Kappan: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020 నుంచి జైలులోనే ఉన్నాడు సిద్ధిఖీ కప్పన్. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ కప్పన్. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ ఆరువారాల పాటు ఢిల్లీలో, ఆ తరువాత కేరళ పోలీసులకు రిపోర్టు చేస్తారని తీర్పు చెప్పింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ సామూహిక అత్యాచార కేసును రిపోర్టు చేసేందుకు వెళ్తున్న క్రమంలో సిద్ధిఖీ కప్పన్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మలయాళ వార్తా పోర్టర్ అజీముఖం రిపోర్టర్ సిద్ధికీ కప్పన్కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అయితే దీనితో సుప్రీంకోర్టు ఏకీభవిచలేదు. తాను నిర్దోషినని.. అక్రమంగా ఇరికించబడ్డానని సుప్రీంకోర్టులో వాదించారు కప్పన్.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
అల్లర్లను ప్రేరేపించడానికి సిద్ధిఖీ కప్పన్కు పీఎఫ్ఐ డబ్బు చెల్లించిందని.. అతను గుర్తింపు పొందిన జర్నలిస్టు కాదని.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. కప్పన్ అల్లర్లను సృష్టించడానికి, పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వాదించింది. కప్పన్ పీఎఫ్ఐకి చెందిన వాడని.. అది ఉగ్రవాద సంస్థ అని యూపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదించారు. కాగా.. కప్పన్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కప్పన్ వద్ద ఏం దొరికాయి.. అతని వద్ద పేలుడు పదార్థాలు కానీ, ఇతర మెటీరియల్ కనుగొనబడలేదని, ఏ రకమైన ప్రచారానికి ఉపయోగించలేదని సీజేఐ జస్టిస్ లలిత్ అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..