Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా తాను యాత్రలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తాను ఈ యాత్రకు నాయకత్వం వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. నాగర్కోయిల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజల కష్టాలు తెలుసుకునే అద్భుత అవకాశమన్నారు. దేశయాత్రకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. విపక్షాలపై బీజేపీ ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతోందని ఆయన విమర్శించారు.
ప్రజలతో మమేకం కావడానికే ఈ యాత్ర అని రాహుల్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాల వల్ల దేశానికి జరిగిన నష్టం, ద్వేషానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టామన్నారు. ఈ దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ తన ఆధీనంలోకి తీసుకుందని.. వాటి ద్వారా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు. తాను ఏమి చేయాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నానన్నారు. తన మనస్సులో ఎలాంటి గందరగోళం లేదన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నికలు జరగనుండగా, రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కాంగ్రెస్ కపిల్ సిబల్, అశ్వనీ కుమార్, గులాం నబీ ఆజాద్లతో సహా అనేక ఉన్నత స్థాయి నిష్క్రమణల పతనాన్ని ఎదుర్కొంటోంది, గాంధీయేతర వ్యక్తి పార్టీని అధ్యక్షుడిగా నడిపించగలరా అనే ప్రశ్నతో కాంగ్రెస్ ఇంకా పోరాడుతోంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!