Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా తాను యాత్రలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తాను ఈ యాత్రకు నాయకత్వం వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. నాగర్కోయిల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజల కష్టాలు తెలుసుకునే అద్భుత అవకాశమన్నారు. దేశయాత్రకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. విపక్షాలపై బీజేపీ ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతోందని ఆయన విమర్శించారు.
ప్రజలతో మమేకం కావడానికే ఈ యాత్ర అని రాహుల్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాల వల్ల దేశానికి జరిగిన నష్టం, ద్వేషానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టామన్నారు. ఈ దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ తన ఆధీనంలోకి తీసుకుందని.. వాటి ద్వారా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు. తాను ఏమి చేయాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నానన్నారు. తన మనస్సులో ఎలాంటి గందరగోళం లేదన్నారు.
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నికలు జరగనుండగా, రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కాంగ్రెస్ కపిల్ సిబల్, అశ్వనీ కుమార్, గులాం నబీ ఆజాద్లతో సహా అనేక ఉన్నత స్థాయి నిష్క్రమణల పతనాన్ని ఎదుర్కొంటోంది, గాంధీయేతర వ్యక్తి పార్టీని అధ్యక్షుడిగా నడిపించగలరా అనే ప్రశ్నతో కాంగ్రెస్ ఇంకా పోరాడుతోంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?