Nimisha Priya: యెమెన్ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని అడగాలన్న సుప్రీంకోర్టు
- యెమెన్ వెళ్లేందుకు అనుమతివ్వండి
- కేంద్రాన్ని అడగాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్లో ఉరిశిక్ష పడిన భారత సంతతి నిర్సు నిమిషా ప్రియకు ప్రస్తుతం ఊరట లభించింది. నిమిషా ప్రియకు ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే ఈ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యెమెన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిషా తరఫున బృందం సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశం తమ పరిధిలో లేదని.. కేంద్ర ప్రభుత్వం దగ్గరకే వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం దగ్గర అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Felix Baumgartner: సూపర్సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్ కన్నుమూత
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
నిమిషా ప్రియ కేసును శుక్రవారం సుప్రీం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. నిమిషా ప్రియకు మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని న్యాయస్థానం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. ఆమెను క్షేమంగా స్వదేశానికి తిరిగిరావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. దీంతో ప్రభుత్వం స్పందనపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన
అసలు నిమిషా ప్రియ ఎవరు..?
నిమిషా ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నర్సు. 2008లో మంచి జీతం కోసం యెమెన్కు వెళ్లారు. అక్కడ ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత, తన సొంత క్లినిక్ను స్థాపించేందుకు యెమెన్కు చెందిన తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కానీ ఈ భాగస్వామ్యం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రియ చెప్పిన దాని ప్రకారం.. తలాల్ ఆమెను శారీరకంగా, ఆర్థికంగా వేధించాడు. ఆమె పాస్పోర్ట్ ను కూడా దొంగిలించాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు ప్రియ 2017లో తలాల్కు సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసింది. కానీ అది వికటించడంతో మహదీ మరణించాడు. దీంతో నిమిషా ప్రియ అరెస్ట్ అయ్యారు. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును ధృవీకరించింది. 2024 చివర్లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమీ ఈ శిక్షను ఆమోదించారు. 2025 జులై 16 నాటికి నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఊరట లభించింది.
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!