Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
- చొరబాటుదారుల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు ఆందోళన
- ఓటు హక్కుకి ఆధార్ ప్రామాణికం కాదని వ్యాఖ్య
- ఆధార్ కార్డు పౌరసత్యానికి రుజువు కాదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో జరిగే రాష్ట్రాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ సర్వే నడుస్తోంది. ఇంకోవైపు ‘SIR’ నిలిపివేయాలంటూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డుతో చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించడమేంటి? అని ప్రశ్నించింది. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్యానించించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ఇక చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయుడు కాదని.. అలాంటప్పుడు ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది కానీ.. ఓటు హక్కు కోసం కాదని పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం
ఆధార్ కార్డు పౌరసత్వం లేదా నివాస స్థలాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తుంది. ఆధార్ అనేది కేవలం సంక్షేమ ప్రయోజనాలు పొందడానికేనని తెలిపింది. ఫారం-6 దరఖాస్తులో ఈసీ కోరిన పత్రాలు సమర్పించాల్సిందేనని.. ఎన్నికల సంఘం పోస్ట్ ఆఫీస్ కాదని పేర్కొంది.
ఇక పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘SIR’పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని చెప్పారు. నిరక్షరాస్యులకు ఫారమ్ ఎలా పూర్తి చేయాలో.. ఎలా రాయాలో తెలియదు.. దీంతో ఫారమ్లు పూర్తి చేయడం చేతగాక పోవడంతో ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఇది కరెక్ట్ కాదని.. వెంటనే ‘సర్’ నిలిపివేయాలని కోరారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!