Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
- చొరబాటుదారుల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు ఆందోళన
- ఓటు హక్కుకి ఆధార్ ప్రామాణికం కాదని వ్యాఖ్య
- ఆధార్ కార్డు పౌరసత్యానికి రుజువు కాదని స్పష్టీకరణ
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో జరిగే రాష్ట్రాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ సర్వే నడుస్తోంది. ఇంకోవైపు ‘SIR’ నిలిపివేయాలంటూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డుతో చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించడమేంటి? అని ప్రశ్నించింది. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్యానించించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ
- West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?
ఇక చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయుడు కాదని.. అలాంటప్పుడు ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది కానీ.. ఓటు హక్కు కోసం కాదని పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం
ఆధార్ కార్డు పౌరసత్వం లేదా నివాస స్థలాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తుంది. ఆధార్ అనేది కేవలం సంక్షేమ ప్రయోజనాలు పొందడానికేనని తెలిపింది. ఫారం-6 దరఖాస్తులో ఈసీ కోరిన పత్రాలు సమర్పించాల్సిందేనని.. ఎన్నికల సంఘం పోస్ట్ ఆఫీస్ కాదని పేర్కొంది.
ఇక పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘SIR’పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని చెప్పారు. నిరక్షరాస్యులకు ఫారమ్ ఎలా పూర్తి చేయాలో.. ఎలా రాయాలో తెలియదు.. దీంతో ఫారమ్లు పూర్తి చేయడం చేతగాక పోవడంతో ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఇది కరెక్ట్ కాదని.. వెంటనే ‘సర్’ నిలిపివేయాలని కోరారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
-
BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
-
Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
-
TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ
-
PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!