Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
- చొరబాటుదారుల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు ఆందోళన
- ఓటు హక్కుకి ఆధార్ ప్రామాణికం కాదని వ్యాఖ్య
- ఆధార్ కార్డు పౌరసత్యానికి రుజువు కాదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో జరిగే రాష్ట్రాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ సర్వే నడుస్తోంది. ఇంకోవైపు ‘SIR’ నిలిపివేయాలంటూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డుతో చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించడమేంటి? అని ప్రశ్నించింది. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్యానించించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇక చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయుడు కాదని.. అలాంటప్పుడు ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది కానీ.. ఓటు హక్కు కోసం కాదని పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం
ఆధార్ కార్డు పౌరసత్వం లేదా నివాస స్థలాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తుంది. ఆధార్ అనేది కేవలం సంక్షేమ ప్రయోజనాలు పొందడానికేనని తెలిపింది. ఫారం-6 దరఖాస్తులో ఈసీ కోరిన పత్రాలు సమర్పించాల్సిందేనని.. ఎన్నికల సంఘం పోస్ట్ ఆఫీస్ కాదని పేర్కొంది.
ఇక పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘SIR’పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని చెప్పారు. నిరక్షరాస్యులకు ఫారమ్ ఎలా పూర్తి చేయాలో.. ఎలా రాయాలో తెలియదు.. దీంతో ఫారమ్లు పూర్తి చేయడం చేతగాక పోవడంతో ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఇది కరెక్ట్ కాదని.. వెంటనే ‘సర్’ నిలిపివేయాలని కోరారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!