Supreme Court: అంత భావోద్వేగంగా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- అంత భావోద్వేగంగా తీసుకోవద్దు
- తగిన సమయంలో విచారిస్తాం
- కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాక్రోచ్ జనతా పార్టీ వివాదంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సోమవారం తిరస్కరించారు. “దీనిని అంత సెంటిమెంట్గా తీసుకోకండి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అంత అత్యవసరం ఏమీ లేదని, పిటిషన్లను తగిన సమయంలో విచారిస్తామని తోసిపుచ్చారు.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అడ్వకేట్ ఎన్కే గోస్వామి మాట్లాడుతూ.. సీజేఐ చేసిన పూర్వ వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చినా.. సోషల్ మీడియాలో ఇప్పటికీ వక్రీకృత ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. “ఇది అంత తీవ్రమైన అత్యవసర అంశం కాదు. సరైన సమయంలో విచారణకు తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ఈ వివాదానికి కారణం మే 15న జరిగిన ఓ విచారణలో సీజేఐ చేసిన వ్యాఖ్యలే. “వ్యవస్థపై దాడులు చేసే కొందరు యువకులు ఉద్యోగాలు లేక.. వృత్తుల్లో స్థానం లేక కాక్రాచ్లలా మారుతున్నారు. కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ విమర్శించడం ప్రారంభిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అనంతరం “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య ఉద్యమం ప్రారంభమైంది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ లీకులు, పాలన వైఫల్యాలపై మీమ్స్, పోస్టులతో ఈ ఉద్యమం వైరల్ అయింది. విమర్శలు పెరగడంతో సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. “నేను దేశ యువతను విమర్శించలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చిన వారినే ఉద్దేశించి మాట్లాడాను” అని స్పష్టం చేశారు.
ఇదే వివాదానికి సంబంధించిన మరో పిటిషన్ కూడా సోమవారం కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు మౌఖిక వ్యాఖ్యలను డబ్బు ఆర్జనకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని, నకిలీ న్యాయవాదులపై దర్యాప్తు జరపాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఆ పిటిషన్ను కూడా అత్యవసరంగా విచారించేందుకు బెంచ్ నిరాకరించింది.
మీడియా కథనాల ప్రకారం.. “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమాన్ని మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే యువకుడు ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాలు కొన్ని రోజుల్లోనే లక్షలాది ఫాలోవర్లను సంపాదించాయి. అనంతరం ఆ ఖాతాల్లో కొన్ని భారత్లో నిలిపివేయబడ్డాయి. జాతీయ భద్రతా అంశాలపై వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక తన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్ హ్యాక్ చేయబడ్డాయని అభిజీత్ దిప్కే ఆరోపించాడు.
ఈ వివాదం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఉన్న దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్రంగా ట్రెండ్ అవుతుండటంతో ఎలాంటి గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా రౌండ్ ది క్లాక్ భద్రత ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. ఇది ఎలాంటి ప్రత్యేక బెదిరింపుల కారణంగా కాదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!