PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో నక్సలిజం, మావోయిజంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా దేశ భద్రతకు, ప్రగతికి సవాలుగా మారిన నక్సల్స్ తుపాకీ సంస్కృతి ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేస్తూనే, సమాజంలో తిష్టవేసిన మరింత ప్రమాదకరమైన వర్గం గురించి దేశాన్ని హెచ్చరించారు. గతంలో అనేక సంవత్సరాల పాటు మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ అధికార వర్గాల్లో చోటు దక్కించుకున్నారని, చివరికి ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా చేరుతూ దేశ విధానాలనే ప్రభావితం చేశారని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల్లో తుపాకులు చేతబట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలో మన భద్రతా బలగాలు విజయం సాధించినప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లో తిష్టవేసిన ‘అర్బన్ నక్సల్స్’ (దిమాగీ నక్సల్స్) ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. హింస, అరాచకాల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు వీరు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారని, ఇలాంటి వారిని సమాజం గుర్తించి పూర్తిగా దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.
యువతను ఈ విచ్ఛిన్నకర శక్తుల బారిన పడకుండా కాపాడుకుని, వారిని వికసిత్ భారత్ సాధించే దిశగా మళ్లించడం మనందరి బాధ్యత అని ప్రధాని నొక్కిచెప్పారు. సరిహద్దుల లోపలి నుంచి వచ్చే ముప్పు అయినా, విదేశీ సరిహద్దుల వెలుపల నుంచి ఎదురయ్యే సవాలైనా ఎదుర్కొనేందుకు భారత్ సదా సిద్ధంగా ఉందన్నారు. ఈ 21వ శతాబ్దంలో దశాబ్దాల నాటి పాత సవాళ్లకు స్వస్తి పలకడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని వ్యాఖ్యానించారు. నక్సలిజం, మావోయిజం నాలుగు దశాబ్దాల పాటు అనేక లక్షల మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయని, ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చి తల్లిదండ్రుల కలలను కల్లలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ నీడలో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన ఈ హింసాత్మక సంస్కృతిని అణచివేసే క్రమంలో 3,500 మందికి పైగా భద్రతా బలగాలు ప్రాణాలు అర్పించారని, ఇది యుద్ధంలో జరిగే ప్రాణనష్టం కంటే తక్కువేమీ కాదని గుర్తుచేశారు. 2014లో దేశ ప్రజలు తమకు అధికారం ఇచ్చేనాటికే నక్సలిజం రహిత భారత్ను నిర్మించాలని గట్టి సంకల్పం తీసుకున్నామని మోడీ తెలిపారు. దశాబ్దాలుగా రక్తాన్ని చిందించిన ఆ నేలపై నేడు వికాసం, నమ్మకం, నూతనోత్సాహాలతో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని హర్షం వ్యక్తం చేశారు. నక్సల్స్ ఊపిరి త్రిప్పుకోలేని స్థితికి చేరుకున్నప్పటికీ, ఈ సవాలును ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని, సురక్షిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తాజావార్తలు
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!