Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
- క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
- పూరీలోని బడా దండాలో ఘటన
- బలభద్రుడి రథాన్ని లాగుతుండగా తొక్కిసలాట
ఒడిశాలోని పూరిలో ఈరోజు భారీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయడగా..వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పూరీలోని బడా దండాలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అంతే కాకుండా రథాన్ని లాగుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా బలభద్రుడి రథాన్ని లాగుతుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.
READ MORE: Minister Kollu Ravindra: రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
Also Read
పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో కలసి జగన్నాథ భగవానుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతల రథాలను దర్శించుకున్నారు. పూరీ రాజు ‘చేర పహనార’ (రథాన్ని శుభ్రపరచడం) ఆచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు రథాన్ని ప్రారంభించారు. లాగడం ప్రక్రియ ప్రారంభమైంది. రథాలలో చెక్క గుర్రాలను ఉంచి, భక్తులకు రథాలను సరైన దారిలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఈ సమయంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రథాలను ‘ప్రదక్షిణ’ చేసి, దేవతలకు నమస్కరించారు.
READ MORE:Minister Kollu Ravindra: రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
కాగా..జగన్నాథ్ రథ యాత్ర ప్రతి యేటా హిందూ మాసం ఆషాఢలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆదివారం ఉయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన జూలై 8 న ఉదయం 4.59 గంటలకు ముగుస్తుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
తాజావార్తలు
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!