China-India: తూర్పు లడఖ్లో చైనా తవ్వకాలు.. దుస్సాహసాన్ని బట్టబయలు చేసిన ఉపగ్రహ చిత్రాలు
- 2020 సంఘర్షణ ప్రదేశానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో సైనిక స్థావరాలు బలోపేతం చేసుకుంటున్న చైనా
- అదే ప్రాంతంలో చైనా సైనిక స్థావరం
- సైనిక స్థావరంలో చైనా సైన్యం భూగర్భ బంకర్ను నిర్మాణం
- బట్టబయలు చేసిన ఉపగ్రహ చిత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది. కొత్త ఉపగ్రహ చిత్రం చైనా దుస్సాహసాన్ని బట్టబయలు చేసింది. పాంగోంగ్ త్సోలో 2020 సంఘర్షణ ప్రదేశానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యారక్లు మరియు ద్వంద్వ వినియోగ సైనిక గ్రామాల చుట్టూ చైనా తన స్థానాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. చైనా సైన్యం అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కూడా అదే ప్రాంతంలో సైనిక స్థావరాన్ని కలిగి ఉంది. అక్కడ డ్రాగన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో బిజీగా ఉంది. సైనిక స్థావరంలో చైనా సైన్యం భూగర్భ బంకర్ను నిర్మించిందని ఉపగ్రహం చిత్రాల్లో కనడబడుతోంది. సమయం వచ్చినప్పుడు ఆయుధాలు, ఇంధనం మరియు సాయుధ వాహనాల కోసం షెల్టర్లను నిల్వ చేయడానికి ఈ బంకర్లను ఉపయోగించవచ్చు. పాంగోంగ్ సరస్సు దగ్గర చైనా కార్యకలాపాలు పెరగడం ఇదే మొదటిసారి కాదు అనేది కూడా నిజం.
READ MORE: Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
Also Read
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
2020 నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది..
LACపై చైనా మరియు భారతదేశం మధ్య ఉద్రిక్తత 2020 నుంచి కొనసాగుతోంది. పాంగోంగ్ సరస్సుకు ఒకవైపు భారత సైన్యం, మరోవైపు చైనా పీఎల్ఏ సైన్యం మోహరించింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు సైనిక స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగినా.. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరలేదు. PLA యొక్క సిర్జాప్ సైనిక స్థావరం కూడా పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న పర్వతాల మధ్య ఉంది. ఈ స్థావరాన్ని పాంగోంగ్ సరస్సు చుట్టూ మోహరించిన చైనా సైనికుల ప్రధాన కార్యాలయం అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చైనా ఈ సైనిక స్థావరాన్ని భారత్ క్లెయిమ్ చేస్తున్న ప్రదేశంలో నిర్మించింది.
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..