China-India: తూర్పు లడఖ్లో చైనా తవ్వకాలు.. దుస్సాహసాన్ని బట్టబయలు చేసిన ఉపగ్రహ చిత్రాలు
- 2020 సంఘర్షణ ప్రదేశానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో సైనిక స్థావరాలు బలోపేతం చేసుకుంటున్న చైనా
- అదే ప్రాంతంలో చైనా సైనిక స్థావరం
- సైనిక స్థావరంలో చైనా సైన్యం భూగర్భ బంకర్ను నిర్మాణం
- బట్టబయలు చేసిన ఉపగ్రహ చిత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది. కొత్త ఉపగ్రహ చిత్రం చైనా దుస్సాహసాన్ని బట్టబయలు చేసింది. పాంగోంగ్ త్సోలో 2020 సంఘర్షణ ప్రదేశానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యారక్లు మరియు ద్వంద్వ వినియోగ సైనిక గ్రామాల చుట్టూ చైనా తన స్థానాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. చైనా సైన్యం అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కూడా అదే ప్రాంతంలో సైనిక స్థావరాన్ని కలిగి ఉంది. అక్కడ డ్రాగన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో బిజీగా ఉంది. సైనిక స్థావరంలో చైనా సైన్యం భూగర్భ బంకర్ను నిర్మించిందని ఉపగ్రహం చిత్రాల్లో కనడబడుతోంది. సమయం వచ్చినప్పుడు ఆయుధాలు, ఇంధనం మరియు సాయుధ వాహనాల కోసం షెల్టర్లను నిల్వ చేయడానికి ఈ బంకర్లను ఉపయోగించవచ్చు. పాంగోంగ్ సరస్సు దగ్గర చైనా కార్యకలాపాలు పెరగడం ఇదే మొదటిసారి కాదు అనేది కూడా నిజం.
READ MORE: Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
2020 నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది..
LACపై చైనా మరియు భారతదేశం మధ్య ఉద్రిక్తత 2020 నుంచి కొనసాగుతోంది. పాంగోంగ్ సరస్సుకు ఒకవైపు భారత సైన్యం, మరోవైపు చైనా పీఎల్ఏ సైన్యం మోహరించింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు సైనిక స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగినా.. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరలేదు. PLA యొక్క సిర్జాప్ సైనిక స్థావరం కూడా పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న పర్వతాల మధ్య ఉంది. ఈ స్థావరాన్ని పాంగోంగ్ సరస్సు చుట్టూ మోహరించిన చైనా సైనికుల ప్రధాన కార్యాలయం అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చైనా ఈ సైనిక స్థావరాన్ని భారత్ క్లెయిమ్ చేస్తున్న ప్రదేశంలో నిర్మించింది.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!