Punjab: రూ.45లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాడు.. గంటల వ్యవధిలోనే పట్టుబడ్డాడు
- రూ.45లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాడు
- గంటల వ్యవధిలోనే పట్టుబడ్డాడు
- ఆదివారం అమృత్సర్లో దిగిన సౌరవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయుల పరిస్థితి దారుణంగా తయారైంది. అమెరికా అధికారుల చేతుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు.. లక్షలు అప్పు చేసి అమెరికా చేరుకుంటే.. తీరా అక్కడ దిగగానే అధికారుల చేతుల్లో చిక్కుకుని ముప్పు తిప్పలు పడుతున్నారు. తాజాగా పంజాబ్కు చెందిన సౌరవ్ తనకు ఎదురైన పరిస్థితిని వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు. అమెరికా నుంచి అమృత్సర్కు వచ్చిన రెండో విమానంలో సౌరవ్ ఉన్నారు. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి.. తిరిగి భారత్కు చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
సౌరవ్.. పంజాబ్ వాసి. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు భూమి అమ్మి రూ.45లక్షలు ఇచ్చి సౌరవ్ను అమెరికాకు పంపించారు. జనవరి 27న మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడు. అంతే 2-3 గంటల వ్యవధిలోనే సౌరవ్ను అమెరికా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. దాదాపు 15-18 రోజులు శిబిరాల్లో ఉంచిన తర్వాత తిరిగి భారత్కు పంపేశారు. ఆదివారం అమృత్సర్లో దిగిన అమెరికా విమానంలో సౌరవ్ ఉన్నారు. ఈ సందర్భంగా తనకెదురైన ఇబ్బందులను మీడియాతో పంచుకున్నాడు.
‘‘నేను జనవరి 27న అమెరికాలోకి ప్రవేశించాను. అమెరికాలోకి ప్రవేశించిన 2-3 గంటల్లోనే పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 2-3 గంటల తర్వాత మమ్మల్ని ఒక శిబిరానికి తీసుకెళ్లారు. మేము 15-18 రోజులు శిబిరంలోనే ఉన్నాం. మా మాట వినడానికి ఎవరూ లేరు. రెండు రోజుల క్రితం మమ్మల్ని వేరే శిబిరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. మేము విమానం ఎక్కినప్పుడు, మమ్మల్ని భారతదేశానికి తిరిగి పంపుతున్నట్లు చెప్పారు..’’ అని సౌరవ్ అన్నారు. ‘‘విమానంలో మా చేతులు, కాళ్ళు కట్టేశారు. మమ్మల్ని పట్టుకున్న క్షణంలోనే మా మొబైల్ ఫోన్లు జప్తు చేశారు.’’ అని సౌరవ్ చెప్పాడు. తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని వాపోయాడు. తన కుటుంబం రూ.45లక్షలు అప్పు చేసి పంపించినట్లు తెలిపాడు. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
అమెరికా ప్రయాణం కోసం సౌరవ్ డిసెంబర్ 17న భారత్ నుంచి బయల్దేరాడు. అక్కడ నుంచి మలేషియాకు.. అక్కడ 10 రోజులు ఉండి.. అనంతరం ఆమ్ట్స్ర్డామ్, పనామా, టపాచులా, చివరకు మెక్సికో నగరానికి విమానంలో వెళ్లి అమెరికా సరిహద్దును దాటినట్లు తెలిపాడు. అయితే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసిన ఏజెంట్ పేరును మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!