Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్కు తీవ్ర అవమానం..
- కరాచీ స్టేడియంలో భారత్ మినహా అన్ని జట్లు జెండాలను ప్రదర్శించిన పాక్ క్రికెట్ బోర్డు..
- భారత్ జెండా కనిపించకపోవడంతో పీసీబీపై సోషల్ మీడియాలో విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం దాయాది దేశంలో పర్యటించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే, ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం వివాదానికి తెర లేపింది. ఈ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా.. అందులో భారత్ జెండా కనిపించకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై క్రికెట్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: US: అమెరికాలో భారీ వర్షాలు.. 9 మంది మృతి
Also Read
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
అయితే, భారత్ పతాకం ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కరాచీ స్టేడియం వేదికగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మ్యాచ్లు జరగనున్నాయి. కానీ, ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సిన చోట భారతదేశ జెండాను ప్రదర్శించకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
Read Also: KCR Birthday: కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
ఇక, పాకిస్థాన్ గడ్డపై ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించకలేదు.. దీంతో టీమిండియా ప్లేయర్లతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు హగ్ చేసుకోవద్దని తమ క్రికెటర్లను పాక్ క్రికెట్ అభిమానులు ఇటీవల హెచ్చరించారు. కాగా, దాయాది దేశం పాకిస్థాన్లో ఆడేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో.. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్కు మార్చారు. ఇక, భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్కు వస్తే.. ఆ మ్యాచ్లు కూడా అక్కడే జరగుతాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్థాన్ మధ్య ఈ నెల 23వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations. pic.twitter.com/rjM9LcWQXs
— Arsalan (@Arslan1245) February 16, 2025
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!