Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్కు తీవ్ర అవమానం..
- కరాచీ స్టేడియంలో భారత్ మినహా అన్ని జట్లు జెండాలను ప్రదర్శించిన పాక్ క్రికెట్ బోర్డు..
- భారత్ జెండా కనిపించకపోవడంతో పీసీబీపై సోషల్ మీడియాలో విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం దాయాది దేశంలో పర్యటించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే, ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం వివాదానికి తెర లేపింది. ఈ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా.. అందులో భారత్ జెండా కనిపించకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై క్రికెట్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: US: అమెరికాలో భారీ వర్షాలు.. 9 మంది మృతి
Also Read
- BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
- Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
అయితే, భారత్ పతాకం ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కరాచీ స్టేడియం వేదికగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మ్యాచ్లు జరగనున్నాయి. కానీ, ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సిన చోట భారతదేశ జెండాను ప్రదర్శించకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
Read Also: KCR Birthday: కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
ఇక, పాకిస్థాన్ గడ్డపై ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించకలేదు.. దీంతో టీమిండియా ప్లేయర్లతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు హగ్ చేసుకోవద్దని తమ క్రికెటర్లను పాక్ క్రికెట్ అభిమానులు ఇటీవల హెచ్చరించారు. కాగా, దాయాది దేశం పాకిస్థాన్లో ఆడేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో.. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్కు మార్చారు. ఇక, భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్కు వస్తే.. ఆ మ్యాచ్లు కూడా అక్కడే జరగుతాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్థాన్ మధ్య ఈ నెల 23వ తేదీన దుబాయ్ వేదికగా జరగనుంది.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations. pic.twitter.com/rjM9LcWQXs
— Arsalan (@Arslan1245) February 16, 2025
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!