Congress: ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు చేయనున్నారని న్యూస్ వైరల్గా మారిపోయింది.. ఇక, రేపు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది.. సోనియా గాంధీ అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలోనే సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలను సమర్పించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న నేతలో ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిన విషమయే..
Read Also: Phone Tapping Case: మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రండి..
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
బీజేపీ నిర్ణయాత్మకంగా గెలిచిన ఉత్తరప్రదేశ్లో, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ నాల్గో స్థానంలో నిలిచింది. పంజాబ్లో, గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో ఓడిపోగా, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్లలో బీజేపీ చేతిలో ఓడిపోయింది… ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాత్రమే స్టార్ క్యాంపెయినర్లు కావడంతో పార్టీ పేలవమైన పనితీరు రాహుల్ గాంధీ నాయకత్వానికి తీవ్రమైన సవాలుగా మారినట్టు అయ్యింది.. ఇక, కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు తమ వ్యూహాన్ని రూపొందించడానికి జీ-23, సంస్థాగత సమగ్రతను డిమాండ్ చేస్తున్న నాయకులు, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో పార్టీ ఓటమి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దిద్దుబాటు చర్యలను జీ-23 సూచించినందున.. రేపటి సమావేశంలో జి-23 నుండి మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రబలమైన శక్తిగా ఉండి.. పంజాబ్లో ఆప్ చేతిలో ఓటమి, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లకు గాను కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవడంతో కాంగ్రెస్ పతనం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. సాధారణ ఎన్నికలలో దాని సంఖ్య గణనీయంగా క్షీణించిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్లలో సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!