Congress: ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు చేయనున్నారని న్యూస్ వైరల్గా మారిపోయింది.. ఇక, రేపు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది.. సోనియా గాంధీ అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలోనే సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలను సమర్పించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న నేతలో ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిన విషమయే..
Read Also: Phone Tapping Case: మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రండి..
Also Read
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
బీజేపీ నిర్ణయాత్మకంగా గెలిచిన ఉత్తరప్రదేశ్లో, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ నాల్గో స్థానంలో నిలిచింది. పంజాబ్లో, గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో ఓడిపోగా, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్లలో బీజేపీ చేతిలో ఓడిపోయింది… ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాత్రమే స్టార్ క్యాంపెయినర్లు కావడంతో పార్టీ పేలవమైన పనితీరు రాహుల్ గాంధీ నాయకత్వానికి తీవ్రమైన సవాలుగా మారినట్టు అయ్యింది.. ఇక, కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు తమ వ్యూహాన్ని రూపొందించడానికి జీ-23, సంస్థాగత సమగ్రతను డిమాండ్ చేస్తున్న నాయకులు, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో పార్టీ ఓటమి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దిద్దుబాటు చర్యలను జీ-23 సూచించినందున.. రేపటి సమావేశంలో జి-23 నుండి మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రబలమైన శక్తిగా ఉండి.. పంజాబ్లో ఆప్ చేతిలో ఓటమి, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లకు గాను కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవడంతో కాంగ్రెస్ పతనం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. సాధారణ ఎన్నికలలో దాని సంఖ్య గణనీయంగా క్షీణించిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్లలో సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!