CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. గురుగ్రామ్లోని మెడాంతా ఆస్పత్రిలో గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లేహ్-లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన దీక్ష విరమించారు. ఈ విషయాన్ని వాంగ్చుక్ స్వయంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
వాంగ్చుక్ తన ప్రకటనలో, పలువురు అంశాలపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిగిన అనంతరం దీక్షను విరమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు తనను కలిసి లేదా లేఖల ద్వారా దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. దీక్ష విరమించడానికి దారితీసిన షరతులు, చర్చల వివరాలను త్వరలో ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడిస్తానని వాంగ్చుక్ తెలిపారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎక్కడా హింసకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
Also Read
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
- Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై స్పందించారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. త్వరలోనే పూర్వపు ఆరోగ్య స్థితికి చేరుకోవాలని కోరుతూ, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కూడా వాంగ్చుక్ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశ మనస్సాక్షిని మేల్కొల్పేందుకు వాంగ్చుక్ చేసిన త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. అయితే ఉద్యమం మాత్రం ఇక్కడితో ముగియదని స్పష్టం చేశారు.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసనలు కొనసాగుతాయని దిప్కే తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా శుక్రవారం శాంతియుత నిరసనల్లో ప్రజలు పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. నీట్ – యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, పోటీ పరీక్షల పారదర్శకత, విశ్వసనీయతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతున్న వేళ, వాంగ్చుక్ దీక్ష ముగిసినా ఉద్యమం మాత్రం కొనసాగుతుందని CJP స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!