Noida: నోయిడాలో సాఫ్ట్వేర్ హత్య.. కారణమిదేనా?
- నోయిడాలో దారుణం
- సాప్ట్వేర్ ఉద్యోగి హత్య
‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’’ అంటూ ఓ గేయ రచయిత సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలను చూసి చలించి రాసిన పాట ఇది. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. రక్తసంబంధికుల మధ్య బంధాలు క్షీణిస్తున్నాయి. అనంతరం ప్రతీకారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కలకాలం తోడుండాల్సిన భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
నూరుల్లా హైదర్(55), అస్మా ఖాన్ (42) భార్యాభర్తలు. అస్మా ఖాన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అస్మా ఖాన్.. మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది. భర్త హైదర్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాడు. అయితే ప్రస్తుతం అతను నిరుద్యోగిగా ఉన్నాడు. వీళ్లిద్దరికీ 2005లో వివాహం జరిగింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతుండగా.. కుమార్తె 8వ తరగతి చదువుతోంది.
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
అయితే చాలా రోజుల నుంచి అస్మా ఖాన్పై హైదర్ అనుమానం పెట్టుకున్నాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నాడు. దీనిపై అనేక రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో సుత్తి తీసుకుని అస్మా ఖాన్ తలపై కొట్టగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కుమారుడు 112 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు చేయగా.. భార్యకు అక్రమ సంబంధం ఉందన్న కారణంతోనే చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. సమాచారం అందగానే ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనాస్థలికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు తేలిందన్నారు. భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నట్లుగా బాధితురాలి సోదరుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో