Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani On Karnataka Elections: భజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను నిషేధిస్తామని పేర్కొన్న కాంగ్రెస్ను ‘హిందూ ద్వేషి’ పార్టీగా కేంద్రమంత్రి స్పృతి ఇరానీ అభివర్ణించారు. భజరంగ్ దళ్ని నిషేధిస్తామని కాంగ్రెస్ బెదిరింపుల్ని ప్రస్తావిస్తూ.. ఏ ప్రత్యర్థినైనా బీజేపీ తిప్పికొడుతుందని, ఆయా పార్టీలు దాడి చేసేదాకా బీజేపీ చూస్తూ ఉండదని హెచ్చరించారు. అంతేకాదు.. కర్ణాటక ఎన్నికల్లో తమ బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం కూడా చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఒక హిందూ ద్వేషి పార్టీ. వారి మెనిఫెస్టోనే ఆ విషయాన్ని ధృవీకరిస్తుంది. హిందూ ఆర్గనైజేషన్ను కాంగ్రెస్ ఉగ్రవాద సంస్థతో పోలుస్తోంది. వారు ఏ మతపరమైన, సామాజిక-రాజకీయ విశ్వాసాలను కలిగి ఉన్నారో ఇది అద్దం పడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
పీఎఫ్ఐపై ఉగ్రవాద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాల్లో ఆ సంస్థను బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాము పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ని కూడా నిషేధిస్తామని కాంగ్రెస్ చేసిన ప్రకటన.. తీవ్ర దుమారానికి తెరలేపింది. దీనిపై స్పృతి మాట్లాడుతూ.. ‘జై బజరంగ్ బలి అని ఎవరో నినాదాలు చేస్తే, కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తుందా? వాళ్లు హిందూ దేవుళ్లను క్షమాపణ అడగగలరా? వారి మెనిఫెస్టో అబద్ధమా?’’ అని ప్రశ్నించారు. ఒకవైపు బజరంగ్ దళ్ని నిషేధిస్తామని చెప్తూనే, మరోవైపు జై బజరంగ్ బలి నినాదాలు చేస్తూ.. కాంగ్రెస్ గందరగోళానికి గురి చేస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బిజెపిపై దాడి చేసే వరకు వేచి ఉండలేమని.. ముందస్తుగా రక్షించడం రాజ్యాంగ హక్కు అని ఇరానీ అన్నారు.
Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి
ఇక కర్ణాటకలో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. తాను జ్యోతిష్యురాలిని కాదని, కానీ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దీనిపై తాను హామీ ఇస్తానని తెలిపారు. లేకపోతే.. హిందూ దేవుళ్ళను కించపరిచే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వారి ముందు సాష్టాంగ పడతారని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!