Sitaram Yechury: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం అవుతున్నాయి.. 2024లో బీజేపీ ఓడిపోతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitaram Yechury comments on BJP: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధ్యక్షుడు, మాజీ హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ఫతేహాబాద్ లో జరిగే ర్యాలీకి హాజరుకావల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారిద్దరు దేశంలో విపక్షాల ఐక్యతపై మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని.. ఇది మంచి పరిణామం అని సీతారాం ఏచూరి అన్నారు. దేశాన్ని ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రజల బతుకుదెరువును కాపాడాలంటే బీజేపీని అధికారంలోంచి దించాలని ఆయన అన్నారు. కేసీఆర్ తో రాష్ట్రస్థాయిలో పనిచేసిన తర్వాత దాని ఆధారంగా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం వస్తుందని ఆయన అన్నారు.
మనుగోడులో బీజేపీని ఓడించేది టీఆర్ఎస్సే అని ఏచూరి అన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. బీజేపీకి వ్యతరేకంగా కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు వారివారి పోరాటాలను కొనసాగిస్తున్నాయని.. 2024లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 400 సీట్లు రావని.. ఓటమి తథ్యం అని వ్యాఖ్యానించారు.
Also Read
- LPG New Rules: ఎల్పీజీ సిలిండర్ న్యూ రూల్స్.. 90 రోజుల గడువు ముగిసింది! ఈ ముఖ్యమైన పనిని ఈరోజే పూర్తి చేయండి
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Read Also: Nupur Sharma: నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలనే పిటిషన్ను నిరాకరించిన సుప్రీంకోర్టు
ఓం ప్రకాష్ చౌతాలా కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మతం, కులం పేరుతో దేశాన్ని విభజించిన బీజేపీ తీరుపై దేశంలోని ప్రతీ పౌరుడు విచారం వ్యక్తం చేస్తున్నాడని అన్నారు. బీజేపీ దేశాన్ని ప్రేమించదని.. వారు డబ్బుతో రాజకీయం చేస్తున్నారని.. దేశాన్ని దోచుకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షాలకు అండగా నిలుస్తారని చౌతాలా అన్నారు. 2024లో అధికార మార్పిడి ఉంటుందని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 25న ఫతేహాబాద్లో ఐఎన్ఎల్డీ నిర్వహించనున్న గౌరవ దినోత్సవ ర్యాలీకి నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, మమతా బెనర్జీ హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
-
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్గా బాస్కి చెప్పేస్తుంది!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!