Punjab: పంజాబ్లో పరిస్థితి ఆందోళనకరమట.. కెనడా, యూకే ఎంపీల మొసలి కన్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కెనడా ఎంపీ జస్రాజ్ సింగ్ హలన్.. భారతదేశంలోని పంజాబ్ నుంచి వస్తున్న నివేదికల గురించి చాలా ఆందోళన చెందుతున్నామని, ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది, కొన్ని ప్రాంతాల్లో నలుగురి కన్నా ఎక్కువ వ్యక్తులు సమావేశాలు కావద్దని ఆంక్షలు విధించింది, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆదివారం ట్వీట్ చేశారు. కెనడాకు చెందిన మరో ఎంపీ రణదీప్ ఎస్ సరాయ్ కూడా ఇదే విధంగా అభిప్రాయాన్ని తెలియజేశారు.
Also Read
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
Read Also: Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్
పంజాబ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ కారణంగా యూకేలో ఉన్న కుటుంబీకులు పంజాబ్ లో ఉన్న తమవారి కోసం ఆందోళన చెందుతున్నారని యూకే సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ విధించడం, సామూహిక అరెస్టులకు పాల్పడుతున్నారని, భారత్ నుంచి ఆందోళనకర నివేదికలు అందుతున్నాయని, ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని, మానవహక్కులను గౌరవించాలని చెబుతూ.. యూకే ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ ట్వీట్ చేశారు.
అయితే ధేసీ ప్రకటనపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో ఖలిస్తానీ భావాలను పెంపొందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జనాభా మద్దతు ఎక్కువగా ఉండే స్లాఫ్ నియోజకవర్గంలో కొత్త ఓట్లను ఈ ప్రకటనల ద్వారా సంపాదించుకోలేరు అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!