Constable Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Illegal Affair: అతనో ప్రభుత్వ ఉద్యోగి. అంతకు మించి సమాజంలోని శాంతి భద్రతలు కాపాడే పదవిలో ఉన్నాడు. నలుగురి ఆదర్శంగా ఉంటూ సమాజంలో తలెత్తే చీడలను తొలగించడం అతడి విధి. కానీ అతడే దారి తప్పాడు. మరో లేడీ కానిస్టేబుల్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ కుటుంబాన్ని బాధలకు గురిచేశాడు. గర్భిణిగా ఉన్న భార్యకు అండగా నిలవాల్సింది పోయి పరాయి మహిళ మోజులో పడి ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. పెద్దల మధ్య పంచాయితీ పెడితే నా అంతటోడు లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దీమా వ్యక్తం చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం తొండపల్లిలో శ్రీశైలం ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని మధాపూర్ డీసీపీ శిల్పవల్లి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు శ్రీశైలం. అతడికి 2021 లో మిట్టకోడూరుకు చెందిన నర్సింహులు కుమార్తె తో వివాహం జరిపించారు పెద్దలు. ప్రస్తుతం ఆమె గర్భిణి. దీంతో ఆమెపై మొహం చాటేశాడు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
Read Also:Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు
బాధితురాలి వివరాల ప్రకారం.. తను గర్భిణి కావడంతో.. మరో లేడీ కానిస్టేబుల్ తో శ్రీశైలం అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. బంధువులంతా ఎంతో నచ్చజెప్పి చూశారు. కానీ శ్రీశైలం బుద్ధి మారలేదు. పెద్దల మధ్య పంచాయతీ పెట్టి మాట్లాడి చూశారు. పంచాయతీలో.. మీ ఇష్టమొచ్చినట్లు ఏమైనా చేసుకోండంటూ కానిస్టేబుల్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. చేసేదేమీ లేక ఆమె భర్త ఇంటి ముందు బంధువులతో బైటాయించింది.
Read Also: Minister KTR: రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి
ఇది ఇలా ఉండగా.. ఓ టీచర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం సయ్యద్ పల్లిలో చోటు చేసుకుంది. సయ్యద్ పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజేందర్.. ప్రతి రోజూ స్కూల్ కి తాగొచ్చి విచక్షణా రహితంగా విద్యార్థులను చితకబాదేవాడు. పిల్లల తల్లిదండ్రులు ఎన్ని సార్లు హెచ్చరించినా తన అలవాటు మానుకోలేదు. దీంతో రాజేందర్ పై ఆగ్రహించిన గ్రామస్థులు డీఈఓ కు ఫిర్యాదు చేశారు.ఈ నెల 15న రాజేందర్ ను విధులనుంచి సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!