Siddaramaiah: ఢిల్లీకి సిద్ధరామయ్య.. సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్
- హైకమాండ్ పెద్దలను కలవనున్న నేతలు
- సీఎం మార్పుపై సిద్ధరామయ్య క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు. దీంతో హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగి చర్చలు కూడా జరిపారు.
ఇది కూడా చదవండి: Pragya Jaiswal : బికినీలో మొత్తం చూపిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
తాజాగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఊహాగానాలకు తెరదించుతూ ఒక జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. ఐదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. నాయకత్వ మార్పుపై ఊహాగానాలను తోసిపుచ్చారు. డీకే.శివకుమార్కు ఆశయాలు ఉండొచ్చు.. అలా చాలా మందికి కూడా ముఖ్యమంత్రి పోస్టుపై ఆశ ఉండొచ్చని తెలిపారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. ఐదేళ్లు తానే ఉంటానని పేర్కొన్నారు. అసంతృప్తిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి ముఖ్యమంత్రి పోస్ట్పై వివాదం నడిచింది. తొలుత డీకే.శివకుమార్ పేరే వినిపించింది. కానీ చివరికి సిద్ధరామయ్యకే ఆ పదవి వరించింది. అప్పట్నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అదే పంచాయితీ చోటుచేసుకోవడంతో కర్ణాటకలో పొలిటికల్ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఇన్చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అసంతృప్తి ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
ప్రస్తుతం హైకమాండ్ను కలిసేందుకు సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్తో ఇద్దరూ సమావేశం కానున్నట్లు వర్గాలు తెలిపాయి. ఇక గురువారం సాయంత్రం రాహుల్ గాంధీని డీకే.శివకుమార్ కలవనున్నారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!