Deve Gowda: దేశంలో బీజేపీ సంబంధం లేని పార్టీని చూపించండి.. మాజీ ప్రధాని సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deve Gowda: మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో జేడీఎస్ పార్టీ పలుమార్లు బీజేపీకి సపోర్టు చేస్తూ మాట్లాడింది. కర్ణాటక ఎన్నికల అనంతంర ఆ పార్టీ తీరు మారింది. తాజాగా దేవేగౌడ కామెంట్స్ ని చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పక్షంలో ఉండరనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త పార్లమెంట్ వేడుకలను కాంగ్రెస్ తో పాటు 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అయినా కూడా జేడీఎస్ తరుపున దేవెగౌడ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన సమయంలో విపక్షాలు అన్నీ రైల్వే మంత్రి రాజీనామాకు పట్టుబట్టగా.. జేడీయూ ఆయనకు మద్దతుగా నిలిచింది.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
Read Also: Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
మంగళవారం బెంగళూరులోని జేపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో చేతులు కలపని పార్టీ ఏదైనా ఉంటే చూపించండి.. ఆ తర్వాత ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడతాను. పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీతో చేతులు కలిపాయి. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారంటూ ఆయన కామెంట్స్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల గురించి జెడి(ఎస్) పార్టీ ఆందోళన చెందదని ఆయన అన్నారు.
ప్రస్తుతం కర్ణాటకలో జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ, బీబీఎంపీ ఎన్నికలు రానున్నాయ ని, ఈ ఎన్నికల్లో పార్టీకి లభించే ప్రజాభిమానాన్ని బట్టి లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని నియోజవర్గాల్లో, ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని అన్నారు. 2024 ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు కలిసి రావడంపై ప్రశ్నిస్తే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయాలన్నారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని దేవెగౌడ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!