Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
Bandi Sanjay Kumar Responds On Kharif Crop Price Hike: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. పంటలకు రెట్టింపు ధర అందించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే.. కేంద్ర కేబినెట్ అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. వరి క్వింటాల్కు రూ.143 పెంచడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1360 ఉంటే.. తాజాగా అది రూ. 2183కు చేరుకుందన్నారు. ఈ లెక్కన.. గతంతో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823 పెరిగిందన్నారు. అలాగే.. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 ధర పెంచడం సంతోషకరమైన విషయమని తెలిపారు. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 నిర్ణయించడం ఆనందదాయకమని చెప్పుకొచ్చారు.
K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
Also Read
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస మద్దతు ధర పెంచిన ప్రధాని మోడీ ప్రభుత్వం.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుందని అన్నారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ.. ఇవాళ (07-06-23) కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందన్నారు. ఈసారి వరికి క్వింటాల్కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రైతాంగం తరఫున మోడీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!