Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar Responds On Kharif Crop Price Hike: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. పంటలకు రెట్టింపు ధర అందించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే.. కేంద్ర కేబినెట్ అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. వరి క్వింటాల్కు రూ.143 పెంచడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1360 ఉంటే.. తాజాగా అది రూ. 2183కు చేరుకుందన్నారు. ఈ లెక్కన.. గతంతో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823 పెరిగిందన్నారు. అలాగే.. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 ధర పెంచడం సంతోషకరమైన విషయమని తెలిపారు. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 నిర్ణయించడం ఆనందదాయకమని చెప్పుకొచ్చారు.
K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
Also Read
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస మద్దతు ధర పెంచిన ప్రధాని మోడీ ప్రభుత్వం.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుందని అన్నారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ.. ఇవాళ (07-06-23) కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందన్నారు. ఈసారి వరికి క్వింటాల్కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రైతాంగం తరఫున మోడీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!