Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar Responds On Kharif Crop Price Hike: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. పంటలకు రెట్టింపు ధర అందించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే.. కేంద్ర కేబినెట్ అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. వరి క్వింటాల్కు రూ.143 పెంచడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1360 ఉంటే.. తాజాగా అది రూ. 2183కు చేరుకుందన్నారు. ఈ లెక్కన.. గతంతో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823 పెరిగిందన్నారు. అలాగే.. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 ధర పెంచడం సంతోషకరమైన విషయమని తెలిపారు. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 నిర్ణయించడం ఆనందదాయకమని చెప్పుకొచ్చారు.
K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస మద్దతు ధర పెంచిన ప్రధాని మోడీ ప్రభుత్వం.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుందని అన్నారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ.. ఇవాళ (07-06-23) కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందన్నారు. ఈసారి వరికి క్వింటాల్కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రైతాంగం తరఫున మోడీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!