Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) అనే యంత్రం ఉన్నట్లు, ఇది ఒక ఇటాలియన్ కంపెనీచే తయారు చేయబడినట్లు తెలుస్తోంది.
ఈ సీఎన్సీ మిషన్ కంప్యూటర్ ద్వారా నియంత్రించబడుతుంది. మాన్యువల్గా సాధ్యం కానీ సామర్థ్యం, స్థిరత్వాన్ని, ఖచ్చితత్వాల స్థాయిని ఉత్పత్తి చేస్తుంది. కార్గోను తనిఖీ చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బృందం, దీనిని పాక్ అణు కార్యక్రమానికి ఉపయోగించవచ్చని ధృవీకరించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి కీలకమైన భాగాలను తయారు చేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
1996 నుంచి సీఎన్సీ యంత్రాలను “వాస్సెనార్ అరేంజ్మెంట్”లో చేర్చారు. ఇది పౌర, సైనిక ఉపయోగాలతో కూడిన పరికరాల విస్తరణను ఆపడానికి ఏర్పాటు చేయబడిని ఇంటర్నేషనల్ ఆర్మ్ కంట్రోల్ రెజిమ్. సాంప్రదాయ ఆయుధాలు మరియు ద్వంద్వ వినియోగ వస్తువులు, సాంకేతికతల బదిలీలపై సమాచారాన్ని మార్పిడి చేసుకునే 42 దేశాల సమూహం. ఇందులో భారత్ కూడా సభ్య దేశంగా ఉంది. సీఎన్సీ యంత్రాన్ని ఉత్తర కొరియా తన అణు కార్యక్రమంలో ఉపయోగించింది.
Read Also: Rameshwaram Cafe Blast: మంగళూర్, బెంగళూర్ పేలుళ్లకు లింక్.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
తాజాగా నౌకలోని సరుకును స్వాధీనం చేసుకున్నామని, పాకిస్తాన్, చైనాల వ్యాప్తిని నిరోధించడం కిందకు ఈ స్వాధీనం వస్తుందని అధికారులు తెలిపారు. లోడింగ్, ఇతర పత్రాల ద్వారా ఈ సరకు షాంగై JXE గ్లోబల్ లాజిస్టిక్స్ కో లిమిటెడ్కి చెందినదని పేర్కొనబడింది. సియాల్కోట్కి చెందిన ‘‘పాకిస్తాన్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ సరకు వెళ్తున్నట్లు తేలింది. భద్రతా సంస్థల విచారణలో 22,180 కిలోగ్రాముల బరువున్న ఈ సరుకును తైయువాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కో లిమిటెడ్ రవాణా చేసిందని, పాకిస్తాన్లోని కాస్మోస్ ఇంజనీరింగ్ కోసం ఉద్దేశించినదని అధికారులు తెలిపారు.
చైనా నుంచి పాకిస్తాన్కి ఎగుమతి అవుతున్న డ్యూయల్ యూజ్ మిలిటరీ గ్రేడ్ వస్తువులను భారత అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి కాడు. కాస్మోస్ ఇంజనీర్, పాకిస్తాన్కి రక్షణ సరఫరాదారు. మార్చి 12, 2022లో నవ షేవా పోర్టులో ఇటాలియన్ నిర్మిత థర్మోఎలెక్ట్రిక్ పరికరాలను భారత అధికారులు అడ్డగించారు. యూరప్, యూఎస్ నుంచి నిషేధిత వస్తువులను కొనుగోలు చేయడానికి చైనాను ఒక మార్గంగా వినియోగించుకుంటోంది పాకిస్తాన్.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!