KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KMM CYBER CASE: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెయ్యికోట్ల సైబర్ చీటింగ్ కేసులపై సిట్ ఏర్పాటైంది. సైబరాసురులు ఆడిన రాక్షస క్రీడను.. అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు వాడిన తీరును సిట్ బృందం వెలికి తీయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే ఉన్న కేసులను స్వాధీనం చేసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి ముందుకు వెళ్లనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి సిట్ టీమ్ దర్యాప్తు ప్రారంభించింది.
ఖమ్మం జిల్లా వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై సిట్ లోతైన విచారణ చేపట్టనుంది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి వారం దర్యాప్తు పురోగతి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించారు కొంత మంది కేటుగాళ్లు. ఆ ఖాతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అలా తమ చేతుల్లో ఉన్న ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించారు. దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల సొమ్మును ఆయా ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడివే అంశాలను సిట్ వెలికి తీయనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సైబర్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు అయ్యారు. మిగిలిన నిందితులు, వారికి సహకరించిన వ్యక్తులు, కంపెనీలు, బ్యాంకు ఖాతాల నెట్వర్క్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు వేగవంతం కావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోత్రు ప్రవీణ్ ఉన్నాడు. పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్.. ఈ భారీ చీటింగ్లో ఇతర నిందితులుగా ఉన్నారు.
- Tags
- Be Alert
- crime
- NTV Telugu
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!